ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్.... ఏకంగా తొమ్మిది బెయిల్ పిటిషన్ల తిరస్కరణ...!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఇస్లామాబాద్ లోని స్థానిక కోర్టులు తిరస్కరించాయి. గతంలో జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించిన పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

New Update
ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్.... ఏకంగా తొమ్మిది బెయిల్ పిటిషన్ల తిరస్కరణ...!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఇస్లామాబాద్ లోని స్థానిక కోర్టులు తిరస్కరించాయి. గతంలో జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించిన పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన తొమ్మిది బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.

ఇటీవల పీటీఐ చేపట్టి ఆందోళనలు హింసాత్మకం అయ్యాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఖానా, బర్ఖాహ్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు ఆయన మూడు బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా ఇస్లామాబాద్ లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం(ఏటీసీ) తిరస్కరించింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన ఆరు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు సెషన్స్ జడ్జి (ఎడిఎస్‌జె) మహ్మద్ సోహైల్ వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ బెయిల్‌ను పొడిగించలేమని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులకు సహకరించాలని ఇమ్రాన్ ఖాన్ ను న్యాయమూర్తి ఆదేశించారు. ఇక తోషాఖానా కేసులో బోగస్ రశీదుకు సంబంధించిన కేసులో ఖాన్ భార్య బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్ 7 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు.

అవినీతి ఆరోపణలపై ఈ ఏడాది మే9 న ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు రక్షణ, మిలటరీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారగ పోలీసులు రంగ ప్రవేశం చేసి అల్లర్లను అదుపులోకి తీసుకు వచ్చారు. హింసాత్మక నిరసనలకు ప్రధాన సూత్రధారి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని పోలీసులు అభియోగాలు మోపారు. పలువురు పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Pak Army Chief Asif Munir, Osama bin Laden

ఒక పందికి లిప్ స్టిక్ వేసినా అది పందేనని మాజీ పెంటగాన్ అధికారి మైఖల్ రూబిన్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ గురించి ఆయన చెప్పిన మాటలు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పాకిస్థాన్ పక్కా ప్రణాళికతో నిర్వహించిందని రూబిన్ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను చనిపోయిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ లాంటివాడని అన్నారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ ఫెలో అయిన రూబిన్ ఎన్ఐఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పహల్గామ్ దాడికి అమెరికా తీసుకోవాల్సిన చర్య ఒకే ఒక్కటి ఉంది. అది పాక్ ను అధికారికంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా గుర్తించడమే అని అన్నారు. బిల్ క్లింటన్ ఇండియా వెళ్ళినప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదులు దాడి చేశారు. ఇదంతా పాకిస్తాన్ దృష్టిని మళ్ళించేందుకే చేస్తోందని రూబిన్ అన్నారు. 

కాశ్మీర్ మాది అంటూ వ్యాఖ్యలు..

కాశ్మీర్ లోని పహల్గామ్ దాడికి వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అని..దానిని తాము ఎప్పటికీ వదులుకోమని అన్నారు. ఈ మాటలే ఉగ్రవాదులకు ఊతమిచ్చాయని..ఆ ధైర్యంతోనే వారు కాశ్మీర్ లో దాడులకు తెగబడ్డారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి కూడా ఈ వాదనను సమర్థించారు. 

పహల్గామ్‌లోని బైసరన్ లోయలో  లష్కరే తొయిబా అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు.. పర్యాటకులపై కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

today-latest-news-in-telugu | usa | pakistan | pentagon | Pakistan Army Chief | osama-bin-laden 

 

Also Read: USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట

Advertisment
Advertisment
Advertisment