Jeevan Reddy Mall: ఎట్టకేలకు జీవన్‌రెడ్డి రీఓపెన్..

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్‌.. బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు ఇటీవల సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మాల్‌ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రీఓపెన్‌ అయ్యింది.

New Update
Jeevan Reddy Mall: ఎట్టకేలకు జీవన్‌రెడ్డి రీఓపెన్..

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్‌.. బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు ఇటీవల సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మాల్‌ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రీఓపెన్‌ అయ్యింది. జీవన్ రెడ్డి బకాయిలు చెల్లించని కారణంగా మే 16న ఆర్టీసీ అధికారులు మాల్‌ను సీజ్ చేశారు. దీంతో ఆ మాల్‌లో కార్యకలాపాలు చేస్తున్న రిలయన్స్, కేఎఫ్‌సీ, ట్రెండ్స్, పీవీఆర్‌ కంపెనీలకు కూడా పెద్ద ఎత్తున లాస్ వచ్చింది. దాదాపు రూ.కోటీ నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశాయి.

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు.. హరీష్ రావు ఫైర్

అయితే ఈ మాల్‌కు సంబంధించి జీవన్ రెడ్డి రూ.3.14 కోట్ల బకాయిలు ఆర్టీసీ సంస్థకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని 3 నెలల క్రితమే అధికారులు జీవన్ రెడ్డికి నోటీసులు పంపారు. నోటీసులకు స్పందించకపోతే మాల్‌ను సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో మాల్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. బకాయిలు చెల్లించేందుకు న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఇటీవలే ఆర్టీసీ అధికారులు, పోలీసులు జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ మాల్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించగా.. చివరకి మధ్యంతర ఉత్తర్వులతో మాల్‌ మళ్లీ తెరుచుకుంది.

Also Read: విదేశాల్లో తెలుగు విద్యార్థులు మృత్యువాత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

New Update
meta

meta

అసలే ఒక పక్క అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. దానికి తోడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఇందులో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మీదనే ఏకంగా సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. జుకర్ బర్గ్ అమెరికా జాతీయ భద్రత గురించి ఆలోచించలేదని...అమెరికన్లను మోసం చేస్తున్నారని మెటాలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ అధికారుల చేతుల్లోకి వెళుతోందని అన్నారు. 

మెటా చైనాతో చేతులు కలిపింది..

మెటా ఇప్పటికే చాలా ప్రాబ్లెమ్స్ ను ఎదుర్కొంటోంది. గోప్యతా విధానం, అనైతిక వ్యాపా విలువలు లాంటి అంశాల్లో మెటా యూఎస్ కాంగ్రెస్ ఎదుట విచారణను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే మెటా మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ వెట్ నెస్ గా మారి జుకర్ బర్గ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడే ఆయనపై విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా ఎగ్జిక్యూటివ్ లు పదేపదే జాతీయ భద్రతను అణగదొక్కారని...అమెరికా విలువలకు ద్రోహం చేయండ తాను చూశానని విలియమ్స్ చెప్పారు. మెటా చైనీస్‌ ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్స్‌తో కంటెంట్‌పై విస్తృత నియంత్రణ లభిస్తుందని చెప్పారు. జుకర్ బర్గ్ అమెరికా దేశ భక్తుడు అని చెబుతారు కానీ చైనాలో 18 బిలియన్ డాలర్ల   వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్‌లు నిర్ణయాలు తీసుకొంటున్నారని విలియమ్స్ ఆరోపించారు.

today-latest-news-in-telugu | meta | mark-zuckerberg

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

 

Advertisment
Advertisment
Advertisment