EX MLA Jaggareddy: కరెంట్ పోయిందని కాదు.. పవర్ పోయిందని.. కేసీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు

TG: కేసీఆర్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ అసలు బాధ కరెంట్ గురించి కాదని.. తనకు, తన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారనే బాధ అని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్‌కు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అన్నారు.

New Update
Jagga Reddy: ఐదేళ్లు రేవంతే సీఎం.. జగ్గారెడ్డి కీలక ప్రకటన

EX MLA Jaggareddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను సీఎం పదవి నుంచి దిగిపోగానే తెలంగాణలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి అని కేసీఆర్ అన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసలు బాధ కరెంట్ గురించి కాదని.. తనకు, తన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారని బాధ అని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అన్నారు.

ALSO READ: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ కు ఆనాడు గుర్తుకు రాని ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు వినడానికి.. నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్ని స్టాంట్స్ చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఈసారి నమ్మకనే ప్రజలు ఆయన్ని ఓడించి ఇంటికి పంపించారని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థులను చూస్తే తెలంగాణలో బీజేపీ గెలిచేందుకు కేసీఆర్ కృషి చేతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా విజయం సాధించలేదని జోస్యం చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుందని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment