Perni Nani: పెన్షన్లు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది మీరు కాదా ?: పేర్ని నానీ

ఏపీలో పెన్షన్ల అంశం చర్చనీయాంశవుతోంది. పెన్షన్స్ ఇవ్వొద్దని ఈసీకి చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ? అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.

New Update
Perni Nani: పెన్షన్లు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది మీరు కాదా ?: పేర్ని నానీ

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లలపై రాజకీయ రగడ నెలకొంది. సిటిజన్‌ ఫర్ డెమొక్రసీ అనే పేరుతో ఎన్నికల సంఘానికి పెన్షన్లు ఆపేయాలని ఫిర్యాదు చేయడంతో.. వైసీపీ నేతలు టీపీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దీనిపై స్పందించారు. ' మాటలు మార్చడంలో చంద్రబాబు సిద్ధస్తుడు. జగన్ మోహన్ రెడ్డి పెన్షన్‌లతో పేదల పొట్టకొట్టారని చంద్రబాబు అంటున్నారు. పెన్షన్స్ ఇవ్వొద్దని చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ?. నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబుకు ఉన్న అక్రమ సంబంధాలు ప్రజలకు తెలియదా ? పెన్షన్స్ ఆగిపోవడానికి కారణం మీరే కాదా ?.

Also read: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..!

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకి.. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ?. కేంద్ర ఎన్నికల సంఘం వాలీంటీర్స్‌ను తప్పించమనగానే సంబరాలు చేసుకున్నారు. ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పేదల ఉసురు చంద్రబాబు కచ్చితంగా తగులుతుంది. గతంలో వాలీంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా?. వాలీంటీర్స్‌ను జగన్ వ్యక్తిగత పెగాసెస్ అంటూ హడావిడి చేశారు. ఇప్పుడు నెలకు 50 వేలు జీతం ఇస్తా అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని' పేర్ని నాని అన్నారు.

Also Read: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment