నా బిడ్డకు తండ్రి అతనే.. లైవ్ లో శాంతి, మదన్ మాటల యుద్ధం!

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆమె భర్త మదన్ మోహన్ మధ్య ఆర్టీవీ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. తన బిడ్డకు తండ్రి సుభాషే అని శాంతి మరో సారి తేల్చి చెప్పగా.. కాదు విజయసాయిరెడ్డే అంటూ మదన్ మోహన్ వాదించారు.

New Update
నా బిడ్డకు తండ్రి అతనే.. లైవ్ లో శాంతి, మదన్ మాటల యుద్ధం!

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బిడ్డకు తండ్రి బీజేపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అంటూ ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపించిన నాటి నుంచి ఈ అంశం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ అంశంపై శాంతి, విజయసారి రెడ్డి ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించి.. మదన్ మోహన్ ఆరోపణలను ఖండించారు. అయితే.. మదన్ మోహన్ మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటూ నిత్యం వివిద వేదికలపై స్పష్టం చేస్తున్నారు.

తాజాగా ఆర్టీవీ నిర్వహించిన ఈ లైవ్ డిబేట్ లో శాంతి, మదన్ మోహన్ ఇద్దరూ జాయిన్ అయ్యారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తన బిడ్డకు తండ్రి సుభాషేనని శాంతి ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది శాంతి. మదన్ మోహన్ మాత్రం విజయసాయి రెడ్డే ఆ బిడ్డకు తండ్రి అంటూ మరో సారి స్పష్టం చేశారు. వీరి డిబెట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు