Jogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు

సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.

New Update
Jogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు

సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు.. తాము గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని, చాలీ చాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్‌ తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌.. తమకు ఇచ్చిన హామీని పట్టించుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలని గత 5 సంవత్సరాలుగా తాము మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, కానీ మంత్రులు తమకు సమయం కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు తమను అవమాన పరిచారని, పదే పదే ఎందుకు వస్తున్నారంటూ విసుక్కున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ ఉద్యోగానికి భద్రత కల్పించి, తమ జీతాన్ని పెంచాలని వారు కోరారు. లేకుంటే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమను నమ్మబలికి తమ ఓట్లను లాక్కున్న కేసీఆర్‌ తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయకపోతే తాము ఏంటో ఎన్నికల్లో చూపిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే

వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ మధ్య వివాదం చెలరేగింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీని తిడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Trinamool MP (1)

Trinamool MP (1)

వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు, చాట్‌లను బీజేపీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ బెనర్జీ మరొ ఎంపీతో గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు ఎంపీలు తిట్టుకున్న వాట్సాప్ చాట్, వీడియోలు బీజేపీ నాయకుల కంటపడింది. దీంతో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు వీటిని విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై బూతులతో రెచ్చిపోయారు. 

Also read; BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

ఈ సమస్యను పరిష్కరించడానికి మమతా బెనర్జీ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. AITC MP 2024 అనే వాట్సాప్ గ్రూప్ నుండి వచ్చిన స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్న ఎంపీని కళ్యాణ్ బెనర్జీ హెచ్చరిస్తున్నారు. ఈసీకి వెళ్లే ముందు మెమోరాండంపై సంతకం చేయడానికి పార్లమెంట్ కార్యాలయంలో సమావేశమవ్వాలని పార్టీ తన ఎంపీలను ఆదేశించినట్లు కనిపిస్తోంది. మెమోరాండం తీసుకెళ్లిన ఎంపీ పార్లమెంటు సమావేశానికి రాకుండా నేరుగా ఈసీకి వెళ్లారు. దీని కారణంగా ఇద్దరు ఎంపీల మధ్య వివాదం చెలరేగింది. వీడియోలో కళ్యాణ్ బెనర్జీ ఇతర శాసనసభ్యుడిని దూషిస్తున్నాడు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

Advertisment
Advertisment