Elon Musk : ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్‌ కు ధీటుగా మరో వేదిక!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ కు దీటుగా X TV appను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.

New Update
Elon Musk : ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్‌ కు ధీటుగా మరో వేదిక!

X TV App : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన 'X' (ట్విట్టర్) ఓనర్ ఎలాన్‌ మస్క్‌(Elon Musk) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌(YouTube) కు దీటుగా మరో వేదికను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు యూజర్స్ హైక్వాలిటీ వీడియోలు ఇందులో అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌(X TV app) ను అందుబాటులోకి తేస్తున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరి(Linda Yaccarino) నో అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Samantha: అవి ఆపండి.. నెటిజన్లకు సమంత సీరియస్ వార్నింగ్!

సరికొత్త, ఆకర్షణీయమైన కంటెంట్‌..
ఈ మేరకు ‘స్మాల్ స్ర్కీన్ నుంచి బిగ్ స్ర్కీన్ వరకు. X అన్నింటినీ మార్చేస్తోంది. X టీవీ యాప్‌తో సరికొత్త, ఆకర్షణీయమైన కంటెంట్‌ను మీ స్మార్ట్‌ టీవీల ద్వారా తీసుకురాబోతున్నా. బిగ్ స్క్రీన్‌లపై అత్యంత నాణ్యమైన కంటెంట్‌, అందులో లీనమయ్యే అనుభవాన్ని, గొప్ప అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రూపుదిద్దుకుంటోంది’ అని ఎక్స్‌ సీఈవో లిండా యాకరినో సోషల్‌ మీడియా(Social Media) వేదికగా తెలిపారు. ఇందుకు సంబంధించి చిన్న వీడియోను ఆమె షేర్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CLP meeting : కాంగ్రెస్ MLA ల జీతాలు కట్....పార్టీ కీలక నిర్ణయం

పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

New Update
CLP meeting

CLP meeting

CLP meeting :  పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25,000 విరాళం తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, రాబోయే ఎన్నికల సన్నాహాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ విరాళాలను వినియోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నోవోటెల్‌ వేదికగా జరిగిన CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హస్తం నేతలందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలని.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని, విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని రేవంత్‌ సూచించారు.పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకూడదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని హెచ్చరించారు.భయపడే పరిస్థితిలో పార్టీ లేదు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలి.అద్దంకి దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

 మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని, మంత్రివర్గ విస్తరణ గురించి ఎవరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగింది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలకు వివరించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment