Hit and Run Case: తాగిన మత్తులో చేశా.. జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్ రన్‌ కేసు నిందితుడు అరెస్ట్!

జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్‌ రన్‌ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కూకట్‌పల్లికి చెందిన ద్వారంపూడి నాగ గా గుర్తించారు. మద్యం మత్తులో నాగ కారు డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది.

New Update
Hit and Run Case: తాగిన మత్తులో చేశా.. జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్ రన్‌ కేసు నిందితుడు అరెస్ట్!

Jubilee Hills Hit and Run Case Update: జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్‌లో ఓ బౌన్సర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ పబ్‌లో పనిచేస్తున్న బౌన్సర్ బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అతను స్పాట్‌లోనే చనిపోయాడు. అయితే డ్రైవర్‌ మాత్రం కారు ఆపకుండా స్పీడ్‌గా పొనిచ్చేశాడు. కనపడకుండా పోయాడు. అయితే సీసీ ఫూటేజీ ఆధారంగా కారు డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే అతను ఇలా చేసినట్టు సమాచారం. నిందితుడిని కూకట్‌పల్లికి చెందిన ద్వారంపూడి నాగ గా గుర్తించారు. కారును స్వాధినం చేసుకున్న పోలీసులు నాగ ను ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదంలో సిక్కు గ్రామానికి చెందిన తారక రామ్ (31) తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అతని సహోద్యోగి రాజు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా పెద్దమ్మ గుడి సమీపంలో కారు ఢీకొట్టింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. పని ముగించుకోని ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఐపీసీ సెక్షన్ 304-ఏ (నిర్లక్ష్యం కారణంగా మరణానికి) కింద కేసు నమోదు చేశారు. తారక్‌ రామ్‌కు ఇటీవలే పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న(జనవరి 24) సాయంత్రం కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.


Also Read: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment