Reaserch Study: తన్నులు తింటున్నారు కానీ తాగడం మాత్రం మానని భర్తలు...

దేశంలో భార్యల చేతిలో తన్నుల తింటున్న భర్తలు ఎక్కువ అవుతున్నారు. పలు కారణాలతో భార్యల చేతిలో మగవాళ్ళు బాగా దెబ్బలు తింటున్నారని చెబుతోంది బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ. ఇందులో తాగి తన్నులు తింటున్నవారే ఎక్కువ అని తెలిపింది.

New Update
Reaserch Study: తన్నులు తింటున్నారు కానీ తాగడం మాత్రం మానని భర్తలు...

Domestic Voilence On Husbands: డొమెస్టిక్ వయొలెన్స్ అంటే ఇంతకు ముందు వరకూ కేవలం భర్తలు భార్యలు కొట్టడం. కానీ ఇప్పుడు దీని డెఫినిషన్ మారిపోనుంది. ఎందుకంటే రోజు రోజుకూ భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తలు ఎక్కువైపోతున్నారుట. బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థలో ఈ విషయం బయటపడింది. వివిధ కారణాల చేత భార్యల చేతిలో భర్తలు దెబ్బలు తింటున్నారు. కానీ అందులో తాగితందనాలు అడుతున్న భర్తలే ఎక్కువగా ఉన్నారని చెబుతోంది రిసెర్చ్ సంస్థ. ఈ రీసెర్చ్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది.

ఐదింతలుపెరిగాయి...

ఇండియాలో భార్య బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందట. 15ఏళ్ళల్లో దాదాపు ఐదింతలు వీరి సంఖ్య పెరిగిందని రీసెర్చ్‌లో తేలింది. ప్రతీ వెయ్యి మంది మహిళల్లో 36 మంది తమ భర్తలను చితగొడుతున్నారుట. ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. 2006లో ఈ నంబర్ కేవలం 7 మాత్రమే ఉండేదని...ఇప్పుడు 36కు పెరిగిందని ఆధారాలు చూపిస్తున్నారు. దీనికి కారణం ఇండియాలో డొమెస్టిక్ వయోలెన్స్ చట్టాలు ఆడవాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. మగవాళ్ళకు ఉండవు. కానీ ఇప్పుడు మగవాళ్ళ కోసం చట్టాలు తేవాలని స్టడీలో సూచిస్తున్నారు.

కొట్టడానికి కారణాలు...

అయితే భార్యలు భర్తలను కొట్టడానికి కారణాలు ఉన్నాయని చెబుతోంది రిసెర్చ్ స్టడీ. ఎక్కువగా చదువుకోని వాళ్ళు, తాగుబోతులు అయిన భర్తలు మాత్రమే భార్యల చేతిలో దెబ్బుల తింటున్నారుట. రోజూ తాగి ఇబ్బంది పెడుతుంటేనే కొడుతున్నామని 18.4 మహిళలు చెబుతున్నారు. అప్పుడప్పుడు తాగి గొడవ చేసేవారిలో కేవలం 6.5 శాతం మంది తన్నులు తింటున్నారు. ఇక భర్తలు తమను కొడుతుంటే తాము తిరిగి కొడుతున్నామని అంటున్నారు 10.9 శాతం మహిళలు. ఇతర కారణాలతో 6.1 శాతం మంది మహిళలు భర్తల మీద చెయ్యి చేసుకుంటున్నారు.

గ్రామాల్లోనే ఎక్కువ...

ఇలా భర్తలను కొట్టే మహిళల సంఖ్య ఎక్కువగా పల్లెల్లోనే ఉంటోంది. అది కూడా 10 కన్నా తక్కువ చదువుకున్న వారే అధికంగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఊరిలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు పెరిగిపోవడం కారణమని అంటున్నారు. ఇక ఇలా భర్తలను భార్యలు అత్యతంత ఎక్కువగా కొడుతున్నది కూడా తెలంగాణలోనే అంట. ఇక్కడ రకరకాల కారణాల వలన మద్యానికి బానిసలై భార్యాబిడ్డలను పట్టించుకోని మగవారు ఎక్కువయ్యారని...అందుకే మగవారిపై గృహహింస పెరిగిందని రీసెర్చ్ చెబుతోంది.

Also Read:Hyderabad : హైదరాబాద్‌లో డ్రగ్స్ సీజ్.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment