TS: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. వృద్ధురాలిని పీక్కు తిన్న పిచ్చి కుక్కలు..! రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాలాల్ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలిని పిచ్చి కుక్కలు పీక్కు తిన్నాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్కల గుంపు ఆమెపై దాడి చేశాయి. రాజ్యలక్ష్మి చనిపోయిన తర్వాత ఆమె శరీరంలోని అవయవాలను కుక్కలు కొరుక్కుతిన్నాయి. By Jyoshna Sappogula 01 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Rajanna Sircilla: ఈ మధ్య కాలంలో వీధి కుక్కల దాడులు మరింత పెరిగాయి. ఎక్కడిపడితే అక్కడ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనుషుల మీద పడి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాలాల్ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలిని పిచ్చి కుక్కలు పీక్కు తిన్నాయి. Also Read: రెచ్చిపోయిన పోకిరీలు.. మరీ ఇంతనా.. వీళ్లను ఏం చేయాలి? పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలు రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్కల గుంపు ఆమెపై దాడి చేశాయి. దాడిలో రాజ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె శరీరంలోని చేతులు, మొహం, అవయవాలు కుక్కలు పీక్కు తిన్నాయి. పొద్దున్నే కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికి ఆమె విగితా జీవిగా కనిపించడంతో అందరు షాక్ అయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. #rajanna-sircilla #telangana-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి