Fasting: ఉపవాసం మంచిదేనా? బయటపడ్డ షాకింగ్‌ నిజాలు

ఫాస్టింగ్‌ వల్ల అధిక కొలెస్ట్రాల్‌ కరిగిపోతుందని నమ్ముతారు. ఉపవాసం వల్ల గుండె జబ్బుల ముప్పుతప్పదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. అయితే ఉపవాసం సమయంలో ఆయా వ్యక్తుల ఇతర అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు చెప్పారు.

New Update
Fasting: ఉపవాసం మంచిదేనా? బయటపడ్డ షాకింగ్‌ నిజాలు

Fasting: ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది అనుకుంటారు. అంతేకాకుండా ఫాస్టింగ్‌ వల్ల అధిక కొలెస్ట్రాల్‌ కరిగిపోతాయని నమ్ముతారు. అయితే ఉపవాసం వల్ల గుండె జబ్బుల ముప్పుతప్పదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేలింది. అంతేకాకుండా కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా బయటపడ్డాయి. ఆహారం తీసుకునే సమయం 8 గంటలకే కుదించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్‌ అధికంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అలాగే హార్ట్‌ ఫెయిల్యూర్‌తో మరణించే అవకాశం కూడా 91శాతం ఉంటుందని చికాగోలోని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనం చెబుతోంది.

Doctors say that fasting can cause heart problems

అధ్యయనం ఏం చెబుతోంది..?

  • చికాగో సైంటిస్టుల బృందం సుమారు 20 వేల మందిపై ఈ పరిశోధన చేసింది. 12 నుంచి 16 గంటల వరకు ఎప్పుడో ఒకసారి ఆహారం తీసుకునేవారు, తరచూ తినేవారి మధ్య ఉన్న తేడాలపై స్టడీ నిర్వహించారు. ఈ అధ్యయనంలో సగటున 48 ఏళ్ల వయసున్నవారు పాల్గొన్నారు. అప్పుడప్పుడు ఫాస్టింగ్‌ ఉంటున్నవారిలో షుగర్‌, బీపీ, హార్ట్‌ సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. టైమ్‌కి ఆహారం తీసుకునేవారితో పోలిస్తే తక్కువగా తినేవారిలో పలు సమస్యలు కనిపించాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గుండె నాళాల్లో సమస్యలు వచ్చి మృతి చెందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Doctors say that fasting can cause heart problems

డేటాను ఎలా విశ్లేషించారు..?

  • సైంటిస్టులు 2003 సంవత్సరం నుంచి 2019 వరకు ఈ అధ్యయనం చేశారు. ఈ సంవత్సరాల మధ్యకాలంలో మృతి చెందినవారి డేటా ఆధారంగా ఈ విషయాలు తెలిపారు. అయితే ఈ డేటా ఎంత వరకు సబబు అనేదానిపై మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. వాస్తవానికి అయితే జీర్ణాశయానికి 24 గంటలు విశ్రాంతి ఇచ్చి సులభంగా క్యాలెరీలను తగ్గించేందుకు ఉపవాసం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి హాని అనేది కరెక్ట్‌ కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఉపవాసం సమయంలో ఆయా వ్యక్తుల ఇతర అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు.

Doctors say that fasting can cause heart problems

ఇది కూడా చదవండి:  చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment