Curd: పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే!

పెరుగు - ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ రెండింటి స్వభావం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కలిపి తింటే అనేక రింగ్‌వార్మ్, తామర, దురద, కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

New Update
Curd: పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే!

Foods You Should Stop Eating With Curd: చాలా మంది పెరుగు లేకుండా తమ భోజనాన్ని పూర్తి చేయరు. కొంతమంది లంచ్‌, డిన్నర్‌ సమయంలో పెరుగు లేకుండా తమ భోజనాన్ని పూర్తి చేయరు. పెరుగును లస్సీ, మజ్జిగ, రైతా రూపంలో పెరుగును రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటారు. పెరుగు తినడం వల్ల పొట్ట సంబంధిత వ్యాధులు దూరమై జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా పెరుగు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. పెరుగు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసు. అయితే పెరుగులో కొన్ని పదార్థాలు కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతో వీటిని తినకండి:
పెరుగు - ఉల్లిపాయ: పెరుగు - ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ రెండింటి స్వభావం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కలిపి తింటే అనేక రింగ్‌వార్మ్, తామర, దురద, కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

చేపలు - పెరుగు : చేపలు తిన్నట్లయితే, ఆ తర్వాత వెంటనే పెరుగు తినకండి. అదే సమయంలో, పెరుగు తీసుకుంటే, దానితో పాటు చేపలను తినవద్దు. ఈ రెంటినీ కలిపి తీసుకుంటే కడుపు నొప్పి రావచ్చు.

పాలు - పెరుగు: పాలతో పెరుగు చేసినప్పటికీ, ఈ రెండింటినీ కలిపి తినకూడదు. పాలు - పెరుగు కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

మామిడి - పెరుగు: చాలా మంది మామిడి షేక్‌లో పెరుగును ఉపయోగిస్తారు. మీరు కూడా అందులో పెరుగు కలిపి మామిడికాయ షేక్ తీసుకుంటే, ఇక నుండి జాగ్రత్తగా ఉండండి. అసలైన, ఇది చెడు ఆహార కలయిక. పెరుగులో ఉండే యానిమల్ ప్రొటీన్‌ను పండ్లలో కలిపి తీసుకుంటే శరీరం ఎసిడిటీ, అజీర్ణం , అనేక ఇతర సమస్యలను ఎదుర్కొంటుంది.

Also Read: హిమోగ్లోబిన్‌ లోపంతో బాధపడుతున్నారా.. అయితే మీ ఆహారంలో ఈ ఒక్కటి చేర్చుకోండి చాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment