DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ!

మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మారుతున్న సమాజంలో ఎదుగుతున్న స్త్రీ స్థితిగతుల గురించి ఆమె మాట్లాడుతూ నేటితరం స్త్రీ ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. ఇళ్లాలిగా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

New Update
DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ!

Womens day: మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణ RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మారుతున్న సమాజంలో ఎదుగుతున్న స్త్రీ స్థితిగతుల గురించి ఆమె మాట్లాడుతూ.. నేటితరం స్త్రీ ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. ఇంట్లో పనులు చేయడమే కాదు బయట కూడా తనవంతు పాత్ర పోషిస్తుందని, ఆనాటి ఇంధిరాగాంధీ నుంచి నేటి ద్రౌపది ముర్ము, నిర్మాలాసీతారామన్ వరకూ ఎంతోమంది అతివలు ఆడపిల్లలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రస్తానంతోపాటు ఇంట్లోనూ ఒక ఇళ్లాలిగా నడుచుకునే తీరు గురించి ఆమె ఓపెన్ అయ్యారు.

ఇండిపెండెంట్ గా గెలిచి నిలిచాను..
డీకే అరుణ మాట్లాడుతూ.. 'నా ప్రయాణం మొత్తం రాళ్లు, ముళ్ల దారిలోనే సాగింది. డీకే అరుణను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్రలు ఎన్ని పన్నినా ధైర్యంగా నిలబడ్డాను. డీకే అరుణ అంటే ప్రజలకు ఒక విశ్వాసం. సాయం చేయడంలో వెనకాడదని ప్రజల బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇంతకాలంగా నిలబెట్టుకుంటూ వస్తున్నా. రాజకీయ ఎదుగుదలను నా శక్తితో ముందుకు తీసుకెళ్తున్న. ప్రజల సపోర్టుతోనే ఇంత వరకూ రాగలిగాను. ఆడది ఏం చేస్తుందనే ఆరోపణలు నేనూ ఎదుర్కొన్నాను. అందరిలాగే నాపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటన్నింటీ పటాపంచలు చేస్తూ నేను మొదటిసారి ఇండిపెండెంట్ గా గెలిచి నిలిచి నేనేంటో చూపించాను. ప్రజలు నన్ను ఆదరించారు, ఆశీర్వదించారు. అదే విశ్వాసాన్ని ఇప్పటికీ నిలబెట్టుకున్నా' అని చెప్పారు.

ఇది కూడా చదవండి: Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్!

సంఖ్య పెరగాల్సిన అవసరముంది..
అలాగే ఆడవాళ్లకు సమాజంలో అనేక అడ్డంకులుంటాయని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మహిళల పట్ల చిన్నచూపు ఉంటుందన్నారు. అయితే స్త్రీలు చాలా తక్కువ శాతం రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇంకా సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్ర మోడీ హయాంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కు కల్పించేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని ఆమె గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత 33 శాతం మహిళలు పార్లమెంట్ కు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు

నూటికి రెండు వందల శాతం..
మహిళలకు పట్టుదల ముఖ్యం. మానసిక దైర్యం ఉంటేనే నిలబడి సాధించగలం. ఇతరుల మాటలు పట్టించుకుంటే ఎదగలేం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. ఎవరు ఏం మాట్లాడిన మనం పట్టించుకోకూడదు. తెల్ల కాగితంపై పిచ్చి గీతలు గీయాలనుకుంటారు. వాటికి బయపడి ఆత్మస్తైర్యం కోల్పోకూడదన్నారు. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఏంపీ పోటీ చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు నూటికి రెండు వందల శాతం తాను గెలుస్తానన్నారు. ఇందిరా గాంధీ డైనమిక్ లిడర్. ఇప్పుడు మోడీ గారు అంతకుమించి డైనమిక్ లీడ్ ర్ గా ఎదిగారు . విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.

వంటగదిలో ఇళ్లాలిగా..
డీకే అరుణ కేవలం రాజకీయాలే కాదు ఇంట్లో పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటాను. వంట గదిలో అప్పుడప్పుడూ గడుపుతుంటా. ఇళ్లు ఊడ్చుకోవడం, బట్టలు సర్దు కోవడం వంటి పనులు చేస్తుంటాను. నాకు ఈ పని రాదు అనేది ఏదీ లేదు. నేను నాన్ వెజ్ కాదు. వెజ్ టేరియన్. పిల్లలు కావాలంటే చేసుకుని తింటారని చెప్పారు. ఇక బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. బీజేపీ ప్రజలవైపు నిలబడింది. ప్రజల కోసమే నిలబడుతుంది. బీజేపీని దెబ్బ తీయడం కోసమే కాంగ్రెస్ ఇదంతా ప్రచారం చేస్తోందన్నారు.

అయోధ్య ప్రభావం..
ఇదొక బ్రహ్మాండమైన కార్యక్రమం. దేశంలో ప్రతి ఇళ్లు, ఊరు పండగ చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే లేదు. రాముడు పుట్టిన స్థలంలో గుడి లేకపోవడమేంటి అని అందిరినీ కదిలించింది. స్వయంగా రాములవారే మోడీతో చేయించారేమో అనిపిస్తోంది. ప్రజల గుండెల్లో మోడీ నిలిచిపోయారు. గ్రామ గ్రామాన రామ నామస్మరణతోపాటు మోడీ పేరు మారుమోగిపోతుంది. ఈ దేశం బాగుపడాలంటే, పేదరికం పోవాలంటే నరేంద్ర మోడీ ఉండాలని కోరుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

మోడీ హయాంలో మహిళలకు దక్కిన గౌరవం..
ప్రధాని మోడీ మహిళను గౌరవస్థితిలో ఉంచాలని చూస్తారు. ఆర్థిక స్తోమత పెంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కంటున్నారు. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మాలసీతారామన్ లకు గౌరవం స్థానం కల్పించారని చెప్పారు. బేట పడావో.. బేటీ బచావో.. తీసుకోచ్చారు. మహిళలు టాయిలెట్ ఉండాలి. ఆత్మ గౌరవంతో బతకాలని చాలా పనులు చేపట్టారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్, మహిళలకు లోన్లు, పొదుపుకు సహకారం అందించారు. చిరు వ్యాపారాలకు సాయం చేస్తూ ఆర్ధిక స్వతంత్రం రావాలని కోరుతున్నారు. ఇక మనమమీద మనకు నమ్మకం ఉండాలని, ఫుల్ టైమ్ కేటాయించాలనుకుంటేనే టరాజకీయాల్లోకి రావాలని సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Manoj Varma
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 24, 2025 14:41 IST

    ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర వాసి అతుల్ మోనే అంత్యక్రియలు పూర్తి



  • Apr 24, 2025 14:06 IST

    ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

    బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.  ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

    BCCI: అలాంటి యాడ్స్‌ లో క్రికెటర్లు ఉండకూడదు..బీసీసీఐకి కేంద్రం హెచ్చరిక!



  • Apr 24, 2025 14:02 IST

    పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

    భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 24, 2025 14:01 IST

    పాస్‌పోర్టు పోగొట్టుకొని పరాయి దేశంలో 42 ఏళ్లు ఉన్న వ్యక్తి.. చివరికీ

    ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. తన పాస్‌పోర్టు పోగొట్టుకొని ఏకంగా 42 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఇండియకు తిరిగివచ్చారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి సమచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home
    Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home

     



  • Apr 24, 2025 14:00 IST

    ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

    జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

    pahalgam attack
    pahalgam attack

     



  • Apr 24, 2025 13:49 IST

    నెల్లూరుకు చేరుకున్న మధుసూదన్ రావు మృతదేహం



  • Apr 24, 2025 13:45 IST

    ఉగ్రవాదంపై యుద్ధం: మోదీ



  • Apr 24, 2025 13:42 IST

    వారిని విడిచిపెట్టం.. మోదీ



  • Apr 24, 2025 13:05 IST

    పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్.. రెండు నిమిషాల పాటు మౌనం

    పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని అన్నారు. బీహార్‌ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

    PM Modi
    PM Modi

     



  • Apr 24, 2025 13:03 IST

    నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన

    ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.

    fauji heroine
    fauji heroine



  • Apr 24, 2025 13:03 IST

    బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!

    బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

    Two Bangladeshi Nationals Arrested in Hyderabad
    Two Bangladeshi Nationals Arrested in Hyderabad

     



  • Apr 24, 2025 13:02 IST

    స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!

    పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్‌ హనీమూన్‌కి స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్లగా ఈ దాడి జరిగింది. వీసా రిజక్ట్ కాకపోయి ఉంటే వినయ్ చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 24, 2025 12:33 IST

    క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్‌.. భారత్‌-పాకిస్థాన్ యుద్ధం జరగనుందా ?

    జమ్మూకశ్మీర్‌లో పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    After Pahalgam terror attack, Pakistan issues fresh notice of missile test off its Karachi coast
    After Pahalgam terror attack, Pakistan issues fresh notice of missile test off its Karachi coast

     



  • Apr 24, 2025 12:14 IST

    జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు

    టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్‌‌‌‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.

    Massive protests in Jammu and Kashmir
    Massive protests in Jammu and Kashmir

     



  • Apr 24, 2025 12:13 IST

    అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం‌ హెల్ప్‌లైన్

    కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

    Telangana State Tourism Development Corporation
    Telangana State Tourism Development Corporation

     



  • Apr 24, 2025 12:12 IST

    ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు

    పాక్ హీరో ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించిన సినిమా ‘అబీర్ గులాల్’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వారిపై మండిపడతున్నారు.

    Fahad khan Movie stopped
    Fahad khan Movie stopped

     



  • Apr 24, 2025 12:12 IST

    ఆర్మీకి చిక్కకుండా.. ఉగ్రవాదులు వాడిన సీక్రెట్ యాప్ ఇదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

    పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు పహల్గాం అడువుల్లోని పర్యాటక స్థలానికి చేరుకునేందుకు ఆల్పైన్ క్వెస్ట్ అనే అప్లికేషన్‌ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ భద్రతా వర్గాలు తెలిపాయి.

    Pahalgam Terror Attack
    Pahalgam Terror Attack

     



  • Apr 24, 2025 12:11 IST

    ఆ టెర్రరిస్ట్ తల కావాలి..లెఫ్టినెంట్ నర్వాల్ సోదరి

    పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. ఆయన సోదరి హరియాణా సీఎం నయాబ్ సింగ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్నను చంపిన వాడి తల కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 



  • Apr 24, 2025 11:37 IST

    ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ వద్ద బ్యారికేడ్స్ ను తొలగించిన పోలీసులు



  • Apr 24, 2025 11:31 IST

    CWC సమావేశంలో నివాళి



  • Apr 24, 2025 11:26 IST

    పెహల్గాం దాడిపై ఢిల్లీలో సిడబ్ల్యుసి ఎమర్జెన్సీ సమావేశం



  • Apr 24, 2025 11:23 IST

    మావోయిస్టులకు దడ పుట్టిస్తున్న కగార్...



  • Apr 24, 2025 11:19 IST

    పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

    పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

    usa
    Pak Army Chief Asif Munir, Osama bin Laden

     



  • Apr 24, 2025 11:18 IST

    కర్రెగుట్టల్లో కాల్పుల మోత..సరిహద్దులన్నీ మూసేసి..బాంబుల వర్షం

    గత మూడు రోజులుగా సంచలనం రేపుతున్న ఆపరేషన్‌ కర్రెగుట్టలు మొదలైంది. ఈ ఉదయం నుంచి గుట్టల్లో బాంబుల మోత మోగుతోంది. కర్రె గుటల్లో హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12 వేల మందితో కూడిన భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.

    Operation Karre Gutta
    Operation Karre Gutta

     



  • Apr 24, 2025 11:00 IST

    జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్ మృతి

    జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగ్గా.. ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. ముష్కరులు ఉన్నారని సమాచారం రావడంతో బలగాలు అక్కడ ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాాల్పుల్లో మృతి చెందారు.

     



  • Apr 24, 2025 10:43 IST

    పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. ఆ దేశ 'ఎక్స్‌' అకౌంట్‌ బ్లాక్‌..

    కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్‌ అధికారిక ఖాతాను బ్లాక్ చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతీకార చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

    Government of Pakistan's account on 'X' blocked in India
    Government of Pakistan's account on 'X' blocked in India

     



  • Apr 24, 2025 10:34 IST

    ANI Tweet



  • Apr 24, 2025 10:32 IST

    Pakistan X Account Ban



  • Apr 24, 2025 10:26 IST

    పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ

    పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.

    Jaipur udwani
    Jaipur udwani

     



  • Apr 24, 2025 10:25 IST

    పాకిస్థాన్‌కు బిగ్ షాక్‌.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించి వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

    India summons Pakistan's top diplomat in New Delhi
    India summons Pakistan's top diplomat in New Delhi

     



  • Apr 24, 2025 10:22 IST

    లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన



  • Apr 24, 2025 10:21 IST

    తిరుమలలో హై అలెర్ట్..!



  • Apr 24, 2025 10:19 IST

    Pahalgam Terrorist Attack



  • Apr 24, 2025 10:16 IST

    Uppalapati Ram Varma



  • Apr 24, 2025 10:10 IST

    నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?

    కాశ్మీర్లోని ఉగ్రదాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని అంటోంది భారత్. దీన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ కు సంబంధించి ఐదు నిర్ణయాలను తీసుకుంది. వీటితో ఆ దేశం అన్ని రకాలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు.

    decisions
    India-Pakistan

     



  • Apr 24, 2025 10:10 IST

    ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా

    పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో సంబంధం లేనప్పుడు పాక్ ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. దీనిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదని అడిగారు. 

    pakistna ex cricketer
    Danish Kaneria

     



  • Apr 24, 2025 10:09 IST

    మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి

    పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాళులు అర్పించారు. ‘‘ ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు స్మితా సబర్వాల్ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారి దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.

     Smita Sabharwal
    Smita Sabharwal

     



  • Apr 24, 2025 10:08 IST

    టీమిండియా హెడ్ కోచ్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు

    టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి వచ్చినట్లు గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. 

    Gautam Gambhir
    Gautam Gambhir Photograph: (Gautam Gambhir)

     



  • Apr 24, 2025 10:07 IST

    కావలి చేరుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్‌ భౌతికకాయం

    నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్‌ లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో కావలి కి చెందిన మధుసూధనరావు హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన మృతదేహం కావలికి చేరుకుంది.

    Body of software engineer Madhusudhan
    Body of software engineer Madhusudhan

     



  • Apr 24, 2025 10:06 IST

    ఉగ్రదాడి వేళ.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల వద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ల గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు.

    Kashmiris' generosity during terror attacks, Free transport for tourists
    Kashmiris' generosity during terror attacks, Free transport for tourists

     



  • Apr 24, 2025 10:05 IST

    హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

    టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు. 



  • Apr 24, 2025 10:03 IST

    AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!



  • Apr 24, 2025 10:01 IST

    టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

    పహల్గాం దాడి చేసింది తామేనని TRF ప్రకటించింది. కానీ దీనివెనక లష్కర్ ఈ తోయిబా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు సమాచారం. 2023లో TRFను భారత్ 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ నిషేధం విధించింది.  



  • Apr 24, 2025 10:01 IST

    ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత



  • Apr 24, 2025 09:59 IST

    కల్మా అంటే ఏంటీ.. అది చదవనందుకు ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు?

    ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.

    Read More



  • Apr 24, 2025 09:56 IST

    Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!



  • Apr 24, 2025 09:38 IST

    నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!

    పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్‌ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



  • Apr 24, 2025 09:37 IST

    Fauji ఉగ్రవాదులు దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి!

    పహల్గామ్ ఎటాక్ తో ప్రభాస్ ఫౌజీ మూవీపై వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాకిస్థానీ మిలటరీ ఆఫీసర్ కూతురు కావడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. శత్రుదేశాల మూలాలున్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు అనే కోణంలో కొందరు నిరసన స్వరం వినిపిస్తున్నారు.

    fauji heroine
    fauji heroine

     



  • Apr 24, 2025 09:35 IST

    BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

    కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో భవిష్యత్తులో పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడవద్దని బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు.  దీనిపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందన్నారు.



  • Apr 24, 2025 09:33 IST

    ఏప్రిల్ 22 ఒక చీకటి రోజు:.. ఉగ్రవాద దాడిపై బాలీవుడ్ సెలెబ్రెటీల ట్వీట్లు

    పహల్గామ్ ఉగ్రవాద దాడి పై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. షారుక్ తో పాటు అనుష్కశర్మ, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ తదితరులు దాడిపై స్పందించారు.v

    pahalgam attack Bollywood stars tweets
    pahalgam attack Bollywood stars tweets

     



Advertisment
Advertisment
Advertisment