YCP: వైసీపీలో వార్.. నాకు ప్రాణహాని ఉందంటున్న కీలక నేత..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. సత్యనారాయణరెడ్డి, శేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. రెండు గ్రూపులుగా విడిపోయిన వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.

New Update
YCP: వైసీపీలో వార్.. నాకు ప్రాణహాని ఉందంటున్న కీలక నేత..!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ కార్యకర్తలే రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. మాటలు యుద్ధం కాస్త ఘర్షణ వాతావరణంగా మారి దాడులకు పాల్పడ్డారు.

Also Read: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..!

ఎన్ డి సి సి బి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి వర్గీయులకు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలత్తురు శేఖర్ రెడ్డి వర్గీయులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. వైసీపీలోనే రెండు వర్గాలు దాడులకు దిగడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాడి ఘటనపై శేఖర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Also Read: చంద్రబాబు పిలుపుతో సమస్య సద్దు మనిగేనా?

తనకు ప్రాణహాని ఉందని, ఎన్ డి సి సి బి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కాల్చి పడేస్తానని బెదిరిస్తున్నాడని, తన ప్రాణాలు కాపాడాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. 20 మంది సత్యనారాయణ రెడ్డి వర్గీయులు ఓకే రకమైన టీషర్ట్లు ధరించి తనను తీవ్రంగా దూషించి కొట్టడానికి వచ్చారని తెలిపారు. దాడి ఘటనపై పార్టీ అగ్రశ్రేణి నాయకులకు తెలియజేశామని వారు ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు