Pawan Kalyan : 29న కొండగట్టుకు, జులై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్ AP: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకొని జులై 1న పిఠాపురానికి వెళ్తారు. మూడు రోజుల పాటు పిఠాపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. By V.J Reddy 26 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pithapuram : జులై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక (Assembly Elections) ల్లో ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తారు. వచ్చే నెల 1న సాయంత్రం పిఠాపురంలో పవన్ వారాహి విజయ సభ నిర్వహిస్తారు. పిఠాపురాన్ని దేశంలోనే రోల్మోడల్గా చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఎన్నికల (Elections) హామీ ప్రకారం పిఠాపురంలో సంక్షేమం మౌలిక వసతులపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించనున్నారు. 3 రోజులు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూ.గో జిల్లాలో ముఖ్యమైన అధికారులతో పవన్ సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 29న కొండగట్టు అంజన్నను దర్శించుకుని 1న సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. గదుల పై టీటీడీ కీలక నిర్ణయం! #assembly-elections #pawan-kalyan #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి