Hrithik Roshan Krrish 4: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇప్పటివరకు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్కి రెడీ అవుతున్నారు. అవును, హృతిక్ రోషన్ తొలిసారి దర్శకుడిగా మారనున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్లో తెరకెక్కబోయే తొలి చిత్రం ‘క్రిష్ 4’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో హృతిక్ ఈ ప్రయాణంపై తన భావాలను షేర్ చేసుకున్నారు. “దర్శకుడిగా మారడం నాకు సంతోషకరం అయినప్పటికీ, కొంత భయం కూడా కలుగుతోంది. ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. మళ్లీ స్కూల్కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక దర్శకుడిగా అనేక విషయాల్లో నైపుణ్యం అవసరం, భారీగా పరిశోధనలు చేయాలి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో, 'ఇది ఎందుకు ఎంచుకున్నానా?' అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయినా, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను,” అంటూ తన డైరెక్షన్ జర్నీపై హృతిక్ ఓపెన్ అయ్యారు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
హృతిక్ త్రిపాత్రాభినయంలో..!
‘క్రిష్ 4’ అనగానే ఫ్యాన్స్లో ఎనలేని క్రేజ్ మొదలైంది. అందుకు కారణం, హృతిక్ ఇందులో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని వినిపిస్తున్న వార్తలు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ టాప్ నటీనటులు కూడా భాగం కానున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ లాంటి ప్రముఖులు ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
ఈ విధంగా క్రిష్ 4 సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా హృతిక్ కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. ఆయన తీసుకున్న ఈ క్రియేటివ్ రిస్క్ బాలీవుడ్లో మరో సెన్సేషన్ను సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.