Loksabha: మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్..మొత్తం 146 కి చేరిన సంఖ్య!

లోక్‌ సభలో ఎంపీల సస్పెన్షన్‌ పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను సభ గురువారం సస్పెండ్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్‌ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.

New Update
Loksabha: మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్..మొత్తం 146 కి చేరిన సంఖ్య!

మరో ముగ్గురు ఎంపీలను (MP)  లోక్‌సభ (Loksabha) గురువారం సస్పెండ్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండైన ఎంపీల సంఖ్య 146 కు చేరుకుంది. డిసెంబర్‌ 13 వ తేదీన పార్లమెంట్‌ లోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సభలో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ విషయం లోక్‌ సభ, రాజ్య సభ రెండింటికి అంతరాయం కలిగించడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణతో ఇప్పటి వరకు 143 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గురువారం నాడు ప్రతిపక్ష ఎంపీలను మరో ముగ్గురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ ఓం బిర్లా.

ఈ రోజు సస్పెండైన వారిలో కాంగ్రెస్‌ ఎంపీలు దీపక్‌ బైజ్‌, నకుల్‌ నాథ్, డీకే సురేశ్‌ లు ఉన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా గురువారం ఎంపీలు పార్లమెంట్‌ నుండి ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ కు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ..మోదీ సభలో భద్రతా ఉల్లంఘన అంశం పై మాట్లాడకుండా ఉండడం శోచనీయమని ఎంపీలో ఆరోపించారు.

ఘటన జరిగి 5 రోజులు అయినప్పటికీ ప్రధాని స్పందించకపోవడం చాలా బాధాకరమని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం బిగించిన ఉరి ఇది అని పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన భద్రతా ఉల్లంఘనలపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సభలోనికి ప్రవేశించి స్మోక్‌ బాంబులు ప్రయోగించిన విషయం గురించి ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడకపోవడంతో విపక్షాలు ఆయన వెంటనే ఈ ఘటన గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also read:  ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన స్టార్ నటుడి కుమారుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.  

New Update
ipl

Abhishek Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు వరుస నాలుగు మ్యాచ్‌ల ఓటమి తర్వాత విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. అయితే ఇది ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా అభిషేక్ నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

IPLలో అత్యధిక స్కోర్లు

175- క్రిస్ గేల్ (RCB) vs PWI, 2013
158- బ్రెండన్ మెకల్లమ్ (KKR) vs RCB, 2008
141- అభిషేక్ శర్మ (SRH) vs PBKS, 2025
140- క్వింటన్ డి కాక్ (LSG) vs KKR, 2022
133- AB డివిలియర్స్ (RCB) vs MI, 2015

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment