PM Modi: ఎన్నికల ప్రచారంలోనే మోడీని చంపేస్తాం.. అగంతకుడి వార్నింగ్!

ఎన్నికల ప్రచారంలో మోడీని లేపేస్తామంటూ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన చెన్నైలోని ఎన్ఐఏ ఆ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

New Update
PM Modi: ఎన్నికల ప్రచారంలోనే మోడీని చంపేస్తాం.. అగంతకుడి వార్నింగ్!

Modi: దేశంలో ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీని లేపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. ‘ఎలక్షన్ ప్రచారంలోనే మోడీని ఎక్కడో ఒక చోట ఖతం చేస్తాం’ అంటూ గుర్తు తెలియని వ్యక్తి వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఫోన్ కాల్‌తో అప్రమత్తమైన చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కార్యాలయం.. ఆ బెదిరింపు కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను​సైతం చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు నుంచి నోయిడాలోని ఓ మీడియా సంస్థకు ఈమెయిల్ పంపిన విషయం తెలిసందే. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా మరోసారి బెదిరింపు కాల్ రావడంతో దేశంలో పోలీస్ బృందాలు అప్రమత్తమయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు