Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు!

టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు 2,64, 804 మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్డు విడుదల చేసింది.

New Update
Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు!

Telangana DSC : టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు (DSC Application) గడువు గురువారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు 2,64, 804 మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు అప్లికేషన్ల ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

మార్చిలో టెట్ నోటిఫికేషన్ (TET Notification) విడుదల చేయడంతో, డీఎస్సీ అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. కాగా, బుధవారం సాయంత్రం వరకు 2,72,798 మంది ఫీజు చెల్లించగా, 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాలు కూడా విడుదల కావడంతో, ప్రభుత్వం డీఎస్సీ అప్లికేషన్ల సవరణకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు 64,556 మంది అభ్యర్థులు దరఖాస్తులను సరి చేసుకున్నారు.

Also read: రుణమాఫీపై రేవంత్ సర్కార్ కొత్త ఆలోచన ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment