Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు!

టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు 2,64, 804 మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్డు విడుదల చేసింది.

New Update
Telangana : డీఎస్సీ దరఖాస్తులకు నేడే చివరి రోజు!

Telangana DSC : టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు (DSC Application) గడువు గురువారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు 2,64, 804 మంది డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు అప్లికేషన్ల ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

మార్చిలో టెట్ నోటిఫికేషన్ (TET Notification) విడుదల చేయడంతో, డీఎస్సీ అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. కాగా, బుధవారం సాయంత్రం వరకు 2,72,798 మంది ఫీజు చెల్లించగా, 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాలు కూడా విడుదల కావడంతో, ప్రభుత్వం డీఎస్సీ అప్లికేషన్ల సవరణకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు 64,556 మంది అభ్యర్థులు దరఖాస్తులను సరి చేసుకున్నారు.

Also read: రుణమాఫీపై రేవంత్ సర్కార్ కొత్త ఆలోచన ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు