Telangana Weather: తెలంగాణలో ఐదు రోజుల్లో డేంజర్ ఎండలు .. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో మరో ఐదురోజులు డేంజర్‌ ఎండలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. హైడ్రేట్ కాకుండా ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించారు.

New Update
Telangana Weather: తెలంగాణలో ఐదు రోజుల్లో డేంజర్ ఎండలు .. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Weather: తెలంగాణలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఎండలు ఐదు రోజులు మరింత డేంజర్ ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. వారంపాటు తీవ్ర వడగాలులు ఉన్నాయన్నారు. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి, వరంగల్, వనపర్తి జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండం, ఖమ్మంలో 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సూర్యాపేటలో విషాదం.. ప్రేమ పెళ్లి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

New Update
mujra party rangareddy

mujra party rangareddy

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్ డే సెలబ్రెషన్స్ పేరుతో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భగ్నం చేశారు. ఈ పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టుగా పోలీసులు వెల్లడించారు.  

Also read :  ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలు 

ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారు కాగా  యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడులు చేశామని ఎస్‌వోటీ పోలీసులు వివరించారు. ఇక ఫామ్ హౌజ్ లో భారీ స్థాయిలో  డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Also Read :  ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

birthday-celebrations | Mujra party | rangareddy | Moinabad Farm house | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-update | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment