అమెరికా నుంచి రప్పించి.. సినిమా లెవెల్‌లో కిడ్నాప్

విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్‌ అనే ఎన్ఆర్ఐ ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

New Update

ఇన్‌స్టాలో పరిచయం అయిన వ్యక్తికి వల వేసి కిడ్నాప్ చేసిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన జమీనా అనే యువతికి అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ మనోహర్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. మనోహర్ తల్లిదండ్రులు విశాఖలోనే ఉండటంతో జమీనా వారి తల్లిదండ్రులో పరిచయం పెంచుకుంది. మనోహర్‌ను పెళ్లి చేసుకుంటానని అతని పేరెంట్స్‌కు చెప్పింది. కానీ అతని తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో అమెరికా నుంచి మనోహర్‌ను రప్పించిన జమీనా తన ఇంటికి తీసుకెళ్లింది.

ఇది కూడా చూడండి: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా

మత్తు పానీయం ఇచ్చి..

మత్తు పానీయం ఇచ్చి అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసింది. అవి చూపించి తనని పెళ్లి చేసుకోవాలని మనోహర్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి బలవంతంగా నిశ్చితార్థం చేయించింది. మనోహర్‌ను బంధించి ఇంట్లోనే ఉంచగా.. ఏదో విధంగా అతను తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆమె దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇలానే కొందరిని మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసిందని పోలీసులు విచారణలో వెల్లడించారు.

ఇది కూడా చూడండి: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment