ఎంతకు తెగించావ్రా ప్రొఫెసర్‌ .. విద్యార్థులను రేప్ చేసి వెబ్‌సైట్లలో వీడియోలు అప్‌లోడ్!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 65 కి పైగా వీడియోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ కూడా చేశాడని పోలీసులు తెలిపారు.

New Update
UP Professor

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగ్న వీడియోలను ఉపయోగించి విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేశాడని, అలాగే లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి.  హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ పై ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి పరారీలో ఉన్నాడు, విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు పోలీసులకు చేరాయి.

Also read :  నా కూతురిపై గ్యాంగ్ రేప్ .. ఆదిత్య ఠాక్రే కారణమంటూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్

రజనీష్ కుమార్ ఎంత మంది మహిళలను వేధించాడో తనకే తెలియదని వెల్లడించాడని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి లంచాలు కూడా తీసుకున్నాడని, లైంగిక వేధింపులకు కూడా పాల్పడేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.  హత్రాస్‌లోని పోలీసు సూపరింటెండెంట్ చిరంజీవ్ నాథ్ సిన్హా ప్రకారం, కుమార్ తన అత్యాచార వీడియోలను రికార్డ్ చేయడానికి తన కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడని తెలిపారు.  65 కి పైగా వీడియోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు.

Also read :  హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు, ట్రోలింగ్స్.. బయోపిక్‌గా తీస్తే బ్లాక్ బస్టరే: మాజీ క్రికెటర్

Also read :  కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment