భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు యువతులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. దమ్మపేట మండలం జగ్గారంలోని అరటితోటలో వీరు పని చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు.

New Update
Two died

TG News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో విషాదం  నెలకొంది. పిడుగుపాటుకు గురై ఇద్దరు యువతులు మృతి చెందారు. గ్రామానికి సమీపంలోని అరటితోటలో పనికి వెళ్ళిన క్రమంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తోటలో పనిచేస్తున్న క్రమంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో వారంతా బయటకు వచ్చారు. కూలీలు ఆటో కోసం వేచి చూస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో సున్నం అనూష (19), కట్టం నాగశ్రీ(17)లు అక్కడికక్కడే మృతిచెందగా.. రాజమ్మ, సీతమ్మ, రత్తమ్మ అనే ముగ్గురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లిలోని ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందటంతో జగ్గారం గ్రామంలో విషాదం నెలకొంది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు