బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి.. వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
bathukamma212

తెలంగాణ బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) మనవడిని తీసుకోని సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళుతుండగా ప్రమాదవశాత్తు సీరియల్‌ బల్బుల లైన్‌పై పడిపోవడం తో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దాంతో వెనకాలే వచ్చిన వ్యక్తులు అతడిని రక్షించే ప్రయత్నం చేయగా యాకయ్య మనుమడిని విడిచిపెట్టడంతో.. ఆయన మనవడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యాకయ్యను నెక్కొండలోని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. 

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment