రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి..

తమిళనాడులో ప్రభుత్వ టీచర్‌పై ఓ ప్రేమోన్మాది దాడి చేసి చంపేసిన ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని రమణిపై క్లాస్‌రూమ్‌లోనే మదన్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

New Update

ఈ రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిపోతున్నాయి. వయస్సతో సంబంధం లేకుండా కొందరు దుండగులు మహిళలపై దారుణానికి పాల్పడుతున్నారు. ఇటీవల తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది టీచర్‌ను కత్తితో పొడిచి కిరాతంగా చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తంజావురులో రమణి అనే యువతి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. మదన్ అనే వ్యక్తితో పెళ్లి చూపులు జరిగాయి.

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

పెళ్లికి నిరాకరించిందని కత్తితో దారుణంగా..

ఇరుకుటుంబాలకి సంబంధం ఒకే కానీ.. రమణికి ఇష్టంలేదని చెప్పింది. దీంతో ఆ యువతిపై మదన్ కోపం పెంచుకున్నాడు. నాతోనే పెళ్లికి నిరాకరిస్తుందా? అని రమణి వర్క్ చేస్తున్న స్కూల్‌కి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రమణి అక్కడిక్కడే మరణించింది. మెడపై తీవ్రంగా గాయం కావడంతో ఆమె అక్కడే మరణించింది. స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

ఇది కూడా చూడండి:  తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ 5 ఏళ్ల బాలుడిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదే ఏరియాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఓ 5 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఓ యువకుడు పండ్ల వ్యాపారం చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

ఆ బాలుడుతో పండ్ల వ్యాపారి స్నేహం చేయడం మొదలు పెట్టాడు. రోజూ పండ్లు ఇస్తూ బాలుడకి దగ్గర అయ్యాడు. చివరికి తల్లిదండ్రులు లేని సమయంలో చూసి బాలుడిని కత్తితో బెదిరించి బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ బాలుడిని కాపాడారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

New Update
bike-accident suryapet

bike-accident suryapet

తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చెడే జనార్దన్‌కు కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో యశస్విని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే తనకు విద్యాబుద్ధులు నేర్పి తనను ఇంతటి ఉన్నతస్థాయికి చేర్చిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఇటీవల ఆమె కొనుగోలు చేసింది.  ఆ బైక్ ను తీసుకుని హైదరాబాద్ నుంచి తన కొలీగ్ నాగఅచ్యుత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేంది. 

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా

అయితే శనివారం అర్ధరాత్రి 12:30 గంటట సమయంలో ఆకుపాముల వద్ద  నేషనల్ హైవేపై చనిపోయి ఉన్న గేదెను గుర్తించక దానిని ఢీకొని పడిపోయారు. అదే టైమ్ లో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా వెళ్లడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. బైక్ నడుపుతున్న నాగఅచ్యుత్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడనుంచి పరారయ్యాడు.  బాధితురాలి బాబాయ్ చేడె సురేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

 

Advertisment
Advertisment
Advertisment