దారుణం.. సహజీవనం చేయలేదని ఏం చేశాడంటే?

ప్రకాశం గిద్దలూరులో సుహాసిని సహజీవనం చేయడం లేదని ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె భర్త రెండేళ్ల కిందట మరణించగా.. నాని అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఆ తర్వాాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో తల్లిదండ్రులతో ఉండటంతో ఆమెను హత్య చేశాడు.

New Update
attack

సహజీనవం చేయలేదని ఓ మహిళలను కత్తితో హతమార్చిన ఘటన గిద్దలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాచర్లకు చెందిన సుహాసినికి ఒక కుమారుడు, కొడుకు ఉన్నాడు. రెండేళ్ల కిందట సుహాసిని భర్త మరణించడంతో ఆమె రాచర్లకు చెందిన నాని అనే వ్యక్తితో హైదరాబాద్ వెళ్లిపోయింది. కొన్ని నెలల పాటు అతనితోనే సహజీవనం చేశారు.

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ఇబ్బంది పెట్టడంతో పోలీసులకు..

ఇద్దరి మధ్య గొడవలు రావడంతో కొన్ని నెలల తర్వాత సుహాసిని గిద్దలూరులో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అక్కడికి వచ్చి కూడా కలిసి ఉందామని నాని ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన కూడా నాని మారకుండా సుహాసినిపై దాడి చేశాడు. 

ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేయగా.. మెడ దగ్గర తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ కొంత సమయానికే చికిత్స తీసుకుంటూ సుహాసిని మరణించింది. బాధితరాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో మార్నింగ్‌ వాక్‌కు చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పులు సంచలనంగా మారింది. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్‌ బజార్‌ ఏరియాలో ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్‌ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్‌ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

ఇది కూడా చూడండి:  ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment