హైదరాబాద్‌ మై హోం భుజలో దారుణం

ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్‌మెంట్ నుంచి కింద పడి మరణించింది.

New Update

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒడిశాకి చెందిన అశ్విత సింగ్ సరోగసి కోసం రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు. సరోగసి ద్వారా పిల్లలను కనడానకి రూ.10 లక్షలు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రాజేష్‌ను కలవడానికి హైదరాబాద్ రాగా.. రాయదుర్గంలోని మైహోం భుజలో ఆమెను కొన్ని బంధించాడు.

ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం

గత కొన్ని రోజుల నుంచి బంధించడంతో..

అశ్విత సింగ్‌ను ఇబ్బంది పెట్టడంతో ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది. తొమ్మిదో అంతస్థులో ఉన్న ఆమె చీర సాయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆరో అంతస్థులోకి దిగే ప్రయత్నం చేస్తుండగా అశ్విత సింగ్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

ఇదిలా ఉండగా.. ఇటీవల మణుగూరు రైలులో కూడా ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కూతురును చూసేందుకు మణుగూరు ప్యాసింజర్‌ రైలులో ప్రయాణం చేస్తున్న మహిళను దివ్యాంగుల బోగీలోని బాత్‌రూంలో మెడ చుట్టూ తువ్వాలు బిగించి ఊపిరాడకుండా చేసి ఓ దుండగుడు చంపాడు. ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు నిందితులు గుర్తించి పట్టుకున్నారు.

ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !

వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు అత్యాచారం చేసి, చంపేస్తున్నాడు. అంతే కాకుండా వారి దగ్గర ఉన్న నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను కూడా తీసుకుని పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment