మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.!

మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామాయంపేట మండలానికి చెందిన ద్యాగల ముత్తవ్వ ఊళ్ళో మంత్రాలు చేస్తుందనే భయంతో గ్రామస్థులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పటించారు. బాధితురాలి కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తలరించగా మార్గం మధ్యలోనే మృతి చెందింది.

New Update
medak crime 1

Medak Crime

Medak Crime :  ఊళ్ళో  మంత్రాలు చేస్తుందనే భయంతో ఓ మహిళను ఇంట్లోనే సజీవదహనం చేశారు గ్రామస్థులు. ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లా రాయంపేట మండలం కాట్రియాలలో చోటు చేసుకుంది. 

Also Read: Iphone Murder: ఎంతకు తెగించార్రా.. ఐఫోన్ కోసం అలా చంపేస్తారా?

పోలీసుల కథనం ప్రకారం 

రాయంపేట మండలం కాట్రియాలలో  ద్యాగల ముత్తవ్వ అనే మహిళా నివాసం ఉంటుంది. అయితే ఈమె ఊళ్ళో మంత్రాలు చేస్తుందని భయపడిన గ్రామస్థులు .. గురువారం రాత్రి ఆమె పై దాడి చేశారు. ఇంట్లోనే ఆమె పై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో ఆమె అరుపులు విన్న కొందరు స్థానికులు  ముత్తవ్వను రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే చికిత్స నిమ్మిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందింది. దాడి భయంతో మృతురాలి కొడుకు, కోడలు ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read:  మాల్ ఓపెనింగ్ లో అపశృతి.. హీరోయిన్, ఎమ్మెల్యే యశస్విని అత్తకు గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment