BREAKING : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ...ఏడుగురు స్పాట్

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

New Update
mp accident

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బద్నావర్-ఉజ్జయిని రోడ్డులోని బామన్సుత గ్రామ సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న గ్యాస్ ట్యాంకర్  - కారు, పికప్ ట్రక్కులను - ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ముగ్గురిని వెంటనే బద్నావర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రత్లాంకు తరలించారు.

Also read :  పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఈ కాలేజీల్లో మీ పిల్లలున్నారా?

Also read :   హోలీ రోజు పోలీసుల ఆంక్షలు.. అలా చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్

అధిక వేగం, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ప్రాథమిక దర్యాప్తులో, అధిక వేగం, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో మందసౌర్, రత్లం మరియు జోధ్‌పూర్ నివాసితులు ఉన్నారు.   ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ కూడా కొంతసేపు స్తంభించిపోయింది, పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి పునరుద్ధరించారు.

Also Read :  నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్‌ కనేరియా సంచలన వ్యాఖ్యలు

Also read :  పాక్ ఆటగాళ్లకు బిగ్ షాక్.. 75 శాతం ఫీజుల్లో కోత విధించిన బోర్డు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తైవాన్‌కి చెందిన ఎన్వీ(57) అతని మాజీ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆమె తండ్రి అస్థికలు దొంగలించాడు. ఆమె మళ్లీ కలిస్తేనే అస్తికలు ఇస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎల్వీని అరెస్ట్ చేసి అస్థికలను ఆమెకి ఇచ్చేశారు.

New Update
Ashes

Ashes Photograph: (Ashes )

తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్‌అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్‌కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్‌తో ఉన్న రిలేషన్‌ను కట్ చేసుకున్నాడు. 

Also read: Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్‌ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్‌కు తిరిగి ఇచ్చారు.  ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. 

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Advertisment
Advertisment
Advertisment