కర్నూలులో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం

కర్నూలులోని చెల్లెల చెలిమలలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వెంటనే బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. బాధితరాలి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై నిప్పు అంటించారు.

New Update
Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చెల్లెల చెలిమలలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి  చేశారు. ఆ తర్వాత యువకుడి ఇంటికి బాధితరాలి కుటుంబీకులు నిప్పు అంటించారు. దీంతో చెల్లెల చెలిమలలో భారీగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

విద్యార్థులతో అసభ్యంగా..

ఇదిలా ఉండగా ఇటీవల మంచిర్యాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అతనికి దేహశుద్ది చేశారు. మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సత్యనారాయణ అనే టీచర్ ఇలా చేయడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు మార్కెట్ ఏరియాలో చెప్పులతో కొట్టారు. దీంతో టీచర్ గోడ దూకి పారిపోయాడు.

ఇది కూడా చూడండి:  రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?

అంతేకాకుండా మద్యం సేవించి పాఠశాలకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.  సత్యనారాయణ మాటలు భరించలేదని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆగ్రహించిన పలువురు తల్లులు పాఠశాలకు వచ్చి టీచర్‌ని కూడా నిలదీశారు. చివరకు బాధిత తల్లిదండ్రులు సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

ఉపాధ్యాయుడు ఎక్కడ కనిపించిన కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పులతో కొడుతున్నారు. ఆఖరికి రోడ్డుపైనే చెప్పులతో కొట్టారు. దీంతో ఉపాధ్యాయుడు చితక బాదుతున్న మహిళలు నుంచి తన తప్పుని క్షమించమని వేడుకున్నాడు. కోపంతో ఉన్న మహిళలు చెప్పులతో ఉపాధ్యాయుడిని ఇంకా చితక బాదారు. ఆ తర్వాత డీఈవోకి ఫిర్యాదు చేశారు. విచారణ చేయమని అధికారులు తెలిపారు. విచారణలో అతను తప్పు చేసినట్లు తేలితే.. సస్పెండ్‌ చేస్తామని డీఈవో తెలిపారు

ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment