మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

కర్ణాటకలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు కామాంధులు ఇద్దరు కుమారుల ముందే సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Karnataka-gang-rape

Karnataka-gang-rape

కర్ణాటకలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు కామాంధులు ఇద్దరు కుమారుల ముందే సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  విజయనగరం జిల్లాకు చెందిన బాధితురాలు  మార్చి 31వ తేదీన తన ఇద్దరు పిల్లలతో కలిసి దావణగెరె జిల్లాలోని హరపనహళ్లిలో ఉన్న ప్రసిద్ధ మత కేంద్రమైన ఉచ్చంగిదుర్గ ఆలయాన్ని సందర్శించుకుంది. 

Also read :  అజిత్ యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్.. మాస్‌ లుక్‌లో అదరగొట్టేశాడుగా!

Also read :  పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

ప్రయాణీకులందరూ దిగిన తర్వాత

అనంతరం తన ఇంటికి వెళ్లడానికి చివరి బస్సు ఎక్కింది. చన్నపుర గ్రామం సమీపంలో బస్సు ముఠా డ్రైవర్, కండక్టర్ ఆమెపై అత్యాచారం చేశారు. ప్రయాణీకులందరూ దిగిన తర్వాత  నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు. డ్రైవర్ బస్సును చన్నపుర సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, పిల్లల నోటిలో గుడ్డను పెట్టి గొంతు బిగించాడని, వారి చేతులను కూడా కట్టేసి, వారి ముందే తల్లిపై సామూహిక అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.  

Also read :  Pawan Kalyan: నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

అయితే పొలాల్లో ఉన్న రైతులు, అటుగా వెళ్తున్నవారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను రక్షించారు. ముగ్గురు నిందితులు - డ్రైవర్ ప్రకాష్ మడివలర, కండక్టర్ సురేష్, హెల్పర్ రాజశేఖర్ - పట్టుకుని అరసికెరె పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరిపై గతంలో ఏడు కేసులు ఉన్నాయి.   ఆశ్చర్యకరంగా స్థానిక పోలీసులు ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించగా...  విజయనగర ఎస్పీ శ్రీహరి బాబు బిఎల్ జోక్యం చేసుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు.  మొత్తానికి ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  

Also read : చనిపోయిందని భర్త అంత్యక్రియలు..మూడేళ్ల తరువాత లవర్తో భార్య ప్రత్యక్షం!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad : మరో అమ్మాయితో లవర్ పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది.

New Update
mallishwari

mallishwari

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే..  మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తు్ంది.  మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

మల్లీశ్వరి కులం వేరే కావడంతో

 దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న  హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుడు జానారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment