Praveen: హైదరాబాద్‌లోనే ప్రవీణ్‌ను చంపేశారు.. కేఏ పాల్ సంచలన వీడియో!

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై కేఏపాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్‌ను హైదరాబాద్‌లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో లేక హీరోలో తేలిపోతుందన్నారు. 

New Update
ka paul ap

Ka Paul Shocking alligations On Pastar Praveen Incident

Praveen: పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై కేఏపాల్ మరో సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్‌ను హైదరాబాద్‌లోనే చంపేశారంటున్నారు. వారం గడుస్తున్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఈ కేసుతో చంద్రబాబు, పవన్ జీరో లేక హీరో తేలిపోతుందన్నారు. 

సీబీఐ ఎంక్వయిరీ చేయాల్సిందే..

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కేఏపాల్.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రవీణ్ పగడాల మరణంపై సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వెయాలనే అంశాన్ని న్యాయమూర్తి ఠాకూర్ కు వివరించడం జరిగిందన్నారు. ఆక్సిడెంట్ అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎక్కడ చేశారు? ఎలా చేశారు? అనేది తెలియాలి కదా అని ప్రశ్నించారు. విజయవాడలో ఎస్సైకి ప్రవీణ్ తాగి వున్నారు అని తెలిసినప్పుడు ప్రవీణ్ తాగితే ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు? ఫైన్ వెయ్యలేదు? అని అడిగారు. మీడియాలో ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ జీరో కావాలా హీరో కావాలా అనేది ఈ కేసులో జరిగే దర్యాప్తు బట్టే తెలుస్తుందన్నారు. ఇక మందు కొన్నది ప్రవీణ్ కాదని, అతని జీవితంలో మందు తాగలేదు కొనలేదని ప్రవీణ్ సోదరి చెబుతున్నారు.  

Also Read :  హనుమంతుడి ఈ 4 మంత్రాలు పఠిస్తే.. మీ కష్టాలన్నీ పరార్!

వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో అని తెలుసుకోమన్నా మాట నిజామా కాదా. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్స్ మీదనే ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల మరణంపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి. సీసీ టివి ఫోటీజ్ డాకుమెంట్స్ ప్రెజర్వు చెయ్యండి. పోస్టుమార్టం రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి. పవన్ కు బుద్ది జ్ఞానం ఉంటే ఇలాంటి చట్టాలు చెయ్యడంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. 

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!

 paster praveen | hyderabad

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Roller Coaster Accident : మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే..  24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.

New Update
women died husband

women died husband

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.  మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఓ యువతి రోలర్ కోస్టర్ ప్రమాదంలో మరణించింది. ఇంతకు ఏం జరిగిదంటే..  24 ఏళ్ల ప్రియాంకకు నిఖిల్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ కూడా అయింది.  మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే ఇద్దరు కలిసి నైరుతి ఢిల్లీలోని కపాషెరా సమీపంలోని వాటర్ అండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళ్లింది. 

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయి

పాపం అక్కడే వారి జీవితం మలుపు తిరిగింది. అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇద్దరు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. బాగా ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది. దీంతో వెంటనే నిఖిల్ ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. అయితే అప్పటికే ప్రియాంక చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.  ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్‌టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు. 

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం

కాబోయే భార్యతో లైఫ్ లాంగ్ ఉండాలని ఎన్నో కలలు కన్న నిఖిల్.. ప్రియాంక తన కళ్లముందే చనిపోవడం చూసి కన్నీటిపర్యంతమయ్యాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక మృతి ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ప్రమాదంపై అమ్యూజ్‌మెంట్ పార్క్‌ ఇంకా ఎలాంటి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Also read : Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

Advertisment
Advertisment
Advertisment