Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్

అతుల్ సుభాష్ లాంటి మరో భార్య బాధితుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని అశోక గార్డెన్ ప్రాంతంలో అభిషేక్ బచాలే(25) ఉరి వేసుకుని మృతిచెందాడు. చనిపోక ముందు ఫేస్‌బుక్ లైఫ్‌లో తన చావుకు భార్య, ఆమె కుటుంబం కారణమని చెప్పి వీడియో తీశాడు.

New Update
kajal husbend sucide

kajal husbend sucide Photograph: (kajal husbend sucide)

అతుల్ సుభాష్ ఆత్మహత్య ఇండియాలోనే సంచలనంగా మారింది. సరిగ్గా అలాంటి విషాదమే మరోకటి చోటుచేసుకుంది. భార్య వేధింపులు భరించలేక భర్త సెల్ఫీ వీడియో తీసికొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న  ఓ యువకుడు భార్య కాజల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు ముందు ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి తన భార్య మరియు ఆమె కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేశారు.

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

భోపాల్‌లోని అశోక గార్డెన్ ప్రాంతంలో అభిషేక్ బచాలే(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు, ఆ యువకుడు తన భార్య, అత్తమామలు అతన్ని హింసించారని ఆరోపించాడు. అతను ఫేస్‌బుక్ లైవ్‌లో తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. అభిషేక్ ఇలా సూసైడ్ చేసుకుంటున్నందుకు అతని కుటుంబానికి క్షమాపణలు కూడా చెప్పాడు. అతను కొన్ని నెలల క్రితం కాజల్‌తో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో అభిషేక్ మాట్లాడుతూ.. “నా జీవితం నాశనం అయింది.” నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. నాన్న దయచేసి నన్ను క్షమించండి. నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా చావుకు నా భార్య కాజల్, ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులే కారణం. కొంతకాలం క్రితం అతని భార్య అభిషేక్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందని అశోక గార్డెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ హేమంత్ శ్రీవాస్తవ ఆజ్ తక్‌తో అన్నారు. ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు తీసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించబడింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment