హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని.. ఆ తర్వాత ఏం చేసిందంటే?

ఏలూరులో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక హాస్టల్‌లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పసికందును హాస్టల్ నుంచి వేరే ఇంట్లోకి పడేయడంతో మరణించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Born Baby

ఏలూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థిని అయిన ఓ 17 ఏళ్ల బాలిక హాస్టల్‌లో పసికందుకు జన్మనిచ్చింది. ఏలూరులోని అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో చదువుతున్న ఓ మైనర్ బాలిక బాత్‌రూమ్‌లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ తర్వాత బాత్రూమ్ అన్ని క్లీన్ చేసి, హాస్టల్ పై నుంచి శిశువుని విసిరేసింది. దీంతో ఆ శిశువు పక్కింట్లో పడింది. ఎత్తు నుంచి పడటంతో ఆ పసికందు మరణించింది. దీనికి సంబంధించి కాల్ రావడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

తొమ్మిది నెలల గర్భిణి అయిన..

అశోక్ నగర్‌ సమీపంలో ఓ కాలేజీలో చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ఆ బాలిక హాస్టల్‌లో ఉంటోంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన కూడా ఇప్పటి వరకు ఆ బాలికను గుర్తించకుండా ఎలా ఉన్నారని హాస్టల్ యాజమాన్యాని విచారిస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థుల అడ్మిషన్, మెడికల్, మెయింటెన్స్ వంటి రికార్డులు కూడా లేవు. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

ఇదిలా ఉండగా ఇటీవల నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక తన ఇంటి దగ్గర ఆటుకుంటుంది. అదే సమయంలో అటువైపుగా వచ్చిన 36 ఏళ్ల బొమ్మెన సాగర్ ఆ చిన్నారిపై కన్నేసాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం చేసి పంపించేశాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పింది. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad : మరో అమ్మాయితో లవర్ పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది.

New Update
mallishwari

mallishwari

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే..  మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తు్ంది.  మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

మల్లీశ్వరి కులం వేరే కావడంతో

 దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న  హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుడు జానారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment