లవర్లకు ముద్దులు, భార్యకు పిడిగుద్దులు.. డీఐజీ కిరణ్ వికృత చేష్టలు.. వీడియోలు వైరల్ !

స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి.  పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు.

New Update
nellore dig

స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి.  పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కిరణ్.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్య అనసూయరాణికి పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు.  భార్యాబిడ్డలను రోజూ చావ బాదుతూ చిత్రహింసలు పెడుతున్నాడు కిరణ్.  ఇందులో భాగంగానే గత రాత్రి సైతం భార్యను చితకబాదాడు కిరణ్.  భర్త దాడిలో స్పృహ కోల్పోయిన అనసూయరాణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు.  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిరణ్ భార్యకు చికిత్స అందించారు వైద్యులు.  

అనంతరం అనసూయరాణి తన భర్తపై  గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.  అనసూయరాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కిరణ్ కుమార్. అనసూయరాణి ప్రస్తుతం ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది. పోస్టల్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తన మీద ఫిర్యాదు చేసిన భార్యకు అండగా వచ్చిన బంధువులపై.. అట్రాసిటీ కేసు పెడతానని కిరణ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.  

పిల్లలు పుట్టకపోవటంతో.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనంతరం అనసూయరాణి మీడియాతో మాట్లాడుతూ... తామిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని వెల్లడించారు. తనకు పిల్లలు పుట్టకపోవటంతో ఓ  పాపను దత్తత తీసుకున్నామని 2012లో  సరోగసీ ద్వారా ఓ బాబుకు పుట్టినట్టుగా తెలిపారు. అయితే  కొన్నేళ్లుగా వేరే మహిళలతో తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె అవేదన వ్యక్తం చేశారు.  తన భర్త పెట్టే టార్చర్ తాళలేక పది నెలల నుంచి వేర్వేరుగా ఉంటున్నట్లుగా వెల్లడించారు.  ప్రస్తుతం పాప విదేశాల్లో చదువుకుంటుండగా, బాబు తనతోనే ఉంటున్నాడనిఅనసూయరాణి  చెప్పుకొచ్చారు.  రెండు రోజుల కిందట తన బంధువుల ఇంటికి వెళ్తుంటే అడ్డుకుని బాబును, తనను తన భర్త కొట్టాడని  అనసూయరాణి తెలిపారు.  

Also Read :  Bengalore: ప్లీజ్ ఉద్యోగం ఇవ్వండి చాలు.. ఉచితంగా పనిచేస్తాను.. బెంగళూరు టెకీ పోస్ట్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment