Peanut Allergy: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే?

అమెరికాకి చెందిన అలిసన్ పికరింగ్ అనే 23 ఏళ్ల యువతి గత కొన్ని రోజుల నుంచి పీనట్ అలెర్జీతో బాధపడుతోంది. డేట్‌కి వెళ్లిన ఆమె తెలియక రెస్టారెంట్‌లో పీనట్ సాస్‌ను కాస్త తిన్నది. వెంటనే ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది.

New Update
peanut allergy

వేరుశెనగ బైట్ ఓ యువతి ప్రాణం తీసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అలిసన్ పికరింగ్ అనే 23 ఏళ్ల యువతి పీనట్ ఎలర్జీ వల్ల తన ప్రాణాలు కోల్పోయింది. తనకి తెలియకుండా చిన్న పల్లీ ముక్క తిన్న ఆమె అస్వస్థతకు గురై  వెంటనే మరణించింది. ఆమె నివాసానికి దగ్గరలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు డేట్ వెళ్లింది.

ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..

తెలియక కొంచెం పీనట్ ఉన్న పదార్థాన్ని తినడంతో..

ఎప్పుడూ కూడా అలిసన్ ఆ రెస్టారెంట్‌లో మహి మహి అనే రెసిపీని ఆర్డర్ చేస్తుంటుంది. ఎప్పటిలాగానే అదే రెసీపీని ఆర్డర్ చేసింది. అయితే ఈ రెసిపీలో కొన్ని మార్పులను ఆ రెస్టారెంట్ యాజమాన్యం చేసింది. కొత్తగా పీనట్ సాస్‌ను అందులో హోటల్ యాజమాన్యం యాడ్ చేసింది. 

ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

ఈ విషయం ఆమెకు తెలియక ఆ రెసిపీని కాస్త తిన్నది. దీంతో వెంటనే ఆమెకు తేడాగా అనిపించి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో  మార్గమధ్యంలోనే అలిసన్ పికరింగ్ మరణించింది. 

ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్‌ ఎమోషనల్‌.. మరీ ఇంత ప్రేమనా!

అలిసన్‌కు పీనట్ అలెర్జీ సమస్య ఉంది. గత కొన్ని రోజులు నుంచి ఆమె అనాఫిలాక్టిక్ షాక్‌తో బాధపడుతుంది. ఈ క్రమంలోనే ఆమె చిన్న ముక్క పీనట్ తినడంతో ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి మరణించింది. అత్యంత ప్రమాదకరమైన అలెర్జీలో వేరుశెనగ అలెర్జీ ఒకటి. ఈ అలెర్జీ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లోనే కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. పొరపాటున చిన్న ముక్క వేరుశెనగ తింటే ఇక ఒక్కసారిగా ప్రాణాలు పోవడం మాత్రం పక్కా. 

ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment