Election Commission: కౌంటింగ్‌ ఏజెంట్లను టేబుళ్ల వద్దకు అనుమతిస్తాం: ఎలక్షన్‌ కమిషన్‌!

అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఆర్వో, ఏఆర్వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని ఈసీ వెల్లడించింది. ఇది ఎంతో ముఖ్యమైన వివరణ అంటూ చెప్పుకొచ్చింది.ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ చేసిన ఆరోపణల పై ఈసీస్పందించింది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

Election Commission: ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ ట్విటర్ ఖాతా ద్వారా చేసిన ఆరోపణల పై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించింది. దీంతో దీని గురించి ఈసీ వివరణ ఇచ్చింది. అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను తొలిసారిగా ఏఆర్‌వో టేబుళ్ల వద్దకు అనుమతించడం లేదంటూ మాకెన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దిల్లీ ఎలక్షన్‌ కమిషన్‌ విభాగం దీని గురించి ఎక్స్‌ ఖాతా వేదికగా స్పందించింది.

అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఆర్వో, ఏఆర్వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని వెల్లడించింది. ఇది ఎంతో ముఖ్యమైన వివరన అంటూ చెప్పుకొచ్చింది. మీ రిటర్నింగ్‌ అధికారులు ఈరోజు ఉదయం వరకు ఈ విషయంలో అంత సానుకూలంగా లేరు అంటూ మాకెన్‌ మరోసారి బదులిచ్చారు.

Also read: 2500 మంది ఉద్యోగులకు ”టాటా” …బైబై!

Advertisment
Advertisment
తాజా కథనాలు