Food Tips: కుక్కర్‌లో వండిన పప్పు ఆరోగ్యానికి ప్రమాదమా?

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పప్పును వివిధ రకాలుగా తయారు చేస్తారు. ప్రెషర్ కుక్కర్‌లో పప్పులు వండటం వల్ల వాటిలోని యూరిక్ యాసిడ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, గోధుమ బీన్స్‌ని కుక్కర్‌లో కంటే నేరుగా ఉడికించుకోవడం మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు.

New Update
Food Tips: కుక్కర్‌లో వండిన పప్పు ఆరోగ్యానికి ప్రమాదమా?

Food Tips: ప్రస్తుత కాలంలో ఏ పని చేయాలన్న సమయం తక్కువగా ఉంటుంది. మరి సమయానికి వంట చేయలంటే ఇంక ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. వంటలను సులభం చేయడానికి పప్పును ప్రెషర్ కుక్కర్‌లో వండుతారు. ఇది పప్పు త్వరగా ఉడికిపోయి. సమయం ఆదా అవుతుంది. భారతీయ ఆహారంలో బియ్యం, పప్పులు చాలా ముఖ్యమైనవి. అన్నం సూప్ లేదా పప్పు లేకుండా భోజనం అసంపూర్ణంగా ఉంటుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పప్పును వివిధ రకాలుగా తయారు చేస్తారు. కానీ చాలా మందికి పప్పు తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. సరిగా జీర్ణం కాదు. దీనికి కారణం మనం వాడే కుక్కర్ అని పరిశోధనల్లో తేలింది. ప్రెషర్ కుక్కర్‌లో పప్పులు వండటం వల్ల వాటిలోని యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అయితే.. పప్పును కుక్కర్‌లో వండకూడదని చెబుతుంటారు. ఇది నిజమేనా? కాదా అనేదానిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి ప్రమాదకరం కాదు:

సపోనిన్, ప్రోటీన్, స్టార్చ్ కారణంగా పప్పులపై నురుగు ఏర్పడుతుంది. ఈ సపోనిన్ పప్పుధాన్యాలలో పరిమిత పరిమాణంలో కనిపిస్తుంది. ఇవి మన శరీరానికి ప్రమాదకరం కాదు. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మీరు ప్రెషర్ కుక్కర్‌లో పప్పును ఉడికించినప్పుడు ఈ నురుగును తొలగించాల్సిన అవసరం ఉండదు. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే దానిని నీటి ద్వారా నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు.

నీరు ఎక్కువగా తాగకూడదు:

మీకు అవకాశం దొరికినప్పుడల్లా పుష్కలంగా నీరు తాగాలి. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదు. అంతేకాకుండా ఎంత తింటున్నామనేది కూడా ముఖ్యమే. కొన్ని చిక్కుళ్ళు తక్కువ మొత్తంలో ప్యూరిన్‌లను కలిగి ఉంటాయి. కాబట్టి ఆకుపచ్చ లేదా గోధుమ బీన్స్ తీసుకోండి. వీటిని కుక్కర్‌లో కంటే నేరుగా ఉడికించుకోవడం మంచిది.

సమయం ఆదా అనుకుంటే డేంజర్:

కుక్కర్‌లో అన్నం, కూరగాయలు వేసి ఉడికించడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ పనిని సులభతరం చేయడానికి కుక్కర్ ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ వంటతో సహా ఇంటి పనులను వీలైనంత సులభంగా చేయాలని చూస్తున్నారు. కుక్కర్లో ఉడికించిన పప్పు తినడం వల్ల కాళ్ల నొప్పులు వస్తాయట. కుక్కర్లో ఉడికించినప్పుడు ఏర్పడే ఫోమురిక్ ఆమ్లం కలిగిన సాపోనిన్లు విషపూరితమైనవని నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కుక్కర్‌లో పప్పు వండేటప్పుడు కుక్కర్ నుంచి నీరు వస్తే దానికి ముందు కొద్దిగా నూనె వేయడం మంచిదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: బేబీ మసాజ్‌కి ఏ ఆయిల్ మంచిదో తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment