మాకు సెలవు ఇవ్వడం లేదు సార్.. ఈసీకి ఫిర్యాదుల మోత!

రేపు జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై చర్యలకు సీఈవో ఆదేశించారు.

New Update
మాకు సెలవు ఇవ్వడం లేదు సార్.. ఈసీకి ఫిర్యాదుల మోత!

Telangana Elections 2023: తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నవారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులకు కంపెనీలు సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. సెలవు ఇవ్వకపోతే తమకు ఫిర్యాదు చేయాలంటూ కంప్లైంట్ నెంబర్ 1950 కి కాల్ చేయాలనీ కోరింది.

ALSO READ: డబ్బుల కట్టడిలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులు ఔట్

ఈ నేపథ్యంలో తాము ఓటు వేసేందుకు తమ కంపెనీలు సెలవు ఇవ్వడం లేదంటూ 1950 కాల్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయట. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. చాలా కంపెనీలు, ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు సీఈవో వికాస్ రాజ్.

తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలకు, స్కూళ్లు, కొన్ని కంపెనీలు సెలవు ఇవ్వడంతో అందరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత ఊర్ల బాట పట్టారు. అన్ని బస్సు స్టాండులు, రైల్వే స్టేషన్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. అయితే, ఎన్నికలు ఉన్నాయని తెలిసిన టీఎస్ ఆర్టీసీ ప్రజలకు బస్సు సౌకర్యం కలిపించడంలో విఫలమైందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

ALSO READ: తెలంగాణ ఎన్నికలు.. రేపు ఇవి కూడా బంద్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment