Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జయిన కారు..ఏడుగురి మృతి! కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది. By Bhavana 10 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది. సోమవారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. చిత్రదుర్గ-షోలాపూర్ ఎన్హెచ్ 50 పై హోసపేటకు చెందిన ఓ కుటుంబం మొత్తం మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హోసపేట సమీపంలోని ఉక్కడకేరికి చెందిన గోనిబసప్ప (65), కెంచమ్మ (80) , భాగ్యమ్మ (30), యువరాజ్ (5), సండూర్ కు చెందిన భీమలింగప్ప (50), అతని భార్య ఉమ (45) వారి కుమారుడు అనిల్ (30) బాధితులు హరపనహళ్లి తాలూకాలోని కులహళ్లిలోని గోనె బసవేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. Also read: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన! వ్యాసనకెరె రైల్వే స్టేషన్ సమీపంలో కుడ్లిగి నుంచి వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూకి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంతలో తమిళనాడు రిజిస్ట్రేషన్ తో వస్తున్న మరో లారీ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపు తప్పి డివైడర్ పై నుంచి దూకి కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతుల్లో రెండేళ్ల బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. రెండు లారీల డ్రైవర్లు పళని స్వామి, రాజేష్లతో పాటు బాలుడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో బాడీలను బయటకు తీయడంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. ఈ ప్రమాదంతో రహదారి మీద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also read: ఈడీ ముందుకు నవదీప్! #road-accident #karnataka సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి