Car Accident: కారు-ట్రక్కు ఢీ..ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్‌లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.కారు సత్నా నుంచి చిత్రకూట్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆదిత్య నారాయణ్ ధుర్వే తెలిపారు

New Update
Car Accident: కారు-ట్రక్కు ఢీ..ముగ్గురు మృతి

Car Accident: మధ్యప్రదేశ్‌లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మజ్గవా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రకూట్ రోడ్డులో మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. కారు సత్నా నుంచి చిత్రకూట్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆదిత్య నారాయణ్ ధుర్వే తెలిపారు.

దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.ఈ ప్రమాదంలో చంద్రభాన్ తివారీ (45), సుదామ దూబే (75) అక్కడికక్కడే మృతి చెందగా, ప్రాచీ తివారీ (22) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన నలుగురిలో 10-12 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల్లో సాగర్ , దామో జిల్లాల వాసులు ఉన్నారు.

Also read:  విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు