/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
Konaseema District : ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు (Chandrababu). కొత్తపేట మండలం వానపల్లిలో స్వర్ణ గ్రామపంచాయతీ గ్రామసభలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి తన నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయల్దేరనున్నారు. 11 గంటల 40 నిమిషాలకు అయినవిల్లి ఎలిఫెంట్ వద్దకు చేరుకుంటారు. అక్కడనుండి రోడ్డు మార్గంలో వానపల్లి చేరుకోనున్నారు సీఎం.
స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామసభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామాలకు కావలసిన మౌలిక వసతులపై మాట్లాడనున్నారు. గ్రామస్తులతోనూ స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. వానపల్లి నుండి రోడ్డు మార్గంలో అయినవిల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. హెలికాప్టర్ లో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ (Rajahmundry Airport) కి చేరుకుంటారు. అక్కడనుండి విమానంలో హైదరాబాద్ (Hyderabad) వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.
Also Read : ఏపీలో మరో భారీ ప్రమాదం