AP : నిమ్మచెట్ల నరికివేతపై చంద్రబాబు వార్నింగ్..!

అన్నమయ్య జిల్లా పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

CM Chandrababu Serious About Cutting Lemon Trees : అన్నమయ్య జిల్లా (Annamayya District) రాజంపేట మండలం పోలిగ్రామంలో నిమ్మచెట్ల (Lemon Trees) నరికివేత ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.

Also Read: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత!

మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు