CM Chandrababu: ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. నిన్న అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. కేంద్రబడ్జెట్లో ప్రత్యేక సాయం, విభజనచట్టంలోని హామీలు, అమరావతి, పోలవరంకు నిధుల కొరకు అమిత్ షాను విజ్ఞప్తి చేశారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. By V.J Reddy 17 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Chandrababu Delhi Tour: ఢిల్లీ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రి కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షాతో (Amit Shah) భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వీరి సమావేశం సాగింది. కేంద్రబడ్జెట్లో ప్రత్యేక సాయం చేయాలని వినతి అందించారు సీఎం. విభజనచట్టంలోని హామీలను నేరవేర్చాలని సూచనలు చేసినట్లు సమాచారం. అమరావతి, పోలవరంకు నిధుల కోసం విజ్ఞప్తి చేశారు. కొత్త జాతీయరహదారులు, రైలు మార్గాల మంజూరు చేయాలని అమిత్ షా ను చంద్రబాబు కోరారు. Also Read: అగ్నిపథ్ ప్రాజెక్ట్ లో కీలక మార్పులు.. బడ్జెట్ లో ప్రతిపాదనలు వస్తాయా? #amit-shah #telugu-news #chandrababu-naidu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి