Kejriwal: నా భార్య పిల్లలతో అయోధ్యకు వెళ్తాను..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! జనవరి 22 తర్వాత తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రాతిష్ట కార్యక్రమం తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. By Bhoomi 17 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రామ్ లల్లాను చూసేందుకు వెళ్లనున్నట్లు ఆయనే స్వయంగా తెలిపారు. శ్రీరాముడిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా అయోధ్య(Ayodhya)కు వెళతానని కేజ్రీవాల్ బుధవారం చెప్పారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.రామ్ లల్లా పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానం గురించి అడిగిన ప్రశ్నకు, కేజ్రీవాల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. తనకు రామమందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఎలాంటి ఆహ్వాన పత్రిక అందలేదని తెలిపారు. ఈ వేడుకకు చాలా మంది వీఐపీలు వస్తారని...అందుకే భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకరిని మాత్రమే అనుమతిస్తారని ట్రస్టు లేఖలో పేర్కొంది. జనవరి 22న తర్వాత నేను తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో దర్శనానికి వెళ్తాను అని కేజ్రీవాల్ చెప్పారు. దేశవ్యాప్తంగా రామ్లల్లా పవిత్రోత్సవం కోసం సన్నాహాలు రామ భక్తితో నిండిన వాతావరణం మధ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నెలలో రెండవ మంగళవారం సుందర్కాండ్ పాత్ను నిర్వహించనుంది. దీనికి సంబంధించి, మంగళవారం అంటే జనవరి 16న, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని రోహిణిలోని హనుమాన్ ఆలయంలో సుందర్కండ్ పాథ్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయనతో పాటు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన కాగా అంతకుముందు కేజ్రీవాల్ కేబినెట్ లోని మంత్రి సౌరభ్ భరద్వాజ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మోదీతోపాటు 22నేరాముడి గుడికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. 23,24 తేదీల్లో ఎందుకు వెళ్లకూడదు. రాముడు ఎప్పుడైనా అక్కడే ఉంటాడు. మీకు భక్తి ఉంటే మీ ఆఫీసుల్లో ఉండి రాముడిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మోదీతో వెళ్లాలి..మోదీతో కూర్చోవాలనేమీ లేదు కదా అన్నారు. #kejriwal #ayodhya సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి