Cloud Burst: అక్కడ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌..కొట్టుకుపోయిన రోడ్లు!

హిమాచల్‌ ప్రదేశ్‌ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి.శుక్రవారంఅర్థరాత్రి క్లౌడ్‌ బరస్ట్‌ అవ్వడంతో కుండపోత వాన పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

author-image
By Bhavana
New Update
Cloud Burst:  అక్కడ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌..కొట్టుకుపోయిన రోడ్లు!

Cloud Burst: హిమాచల్‌ ప్రదేశ్‌ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి. శుక్రవారం అర్థరాత్రి సిమ్లా జిల్లాలోని రాంపూర్‌ సబ్‌డివిజన్‌లో గల తక్లోచ్‌ ప్రాంతంలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వాన కురిసింది. దీంతో చాలా వరకు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.

క్లౌడ్‌ బరస్ట్‌ గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ అనుపమ్‌ కశ్యప్‌ పేర్కొన్నారు.ఈ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 58 రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అందులో సిమ్లాలో 19 రోడ్లు, మండిలో 14, కాంగ్రాలో 12, ​కులులో ఎనిమిది, కిన్నౌర్‌లో మూడు, సిర్మౌర్, లాహౌల్ స్పితి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రహదారులను మూసివేసినట్లు తెలిపారు. ఇక ఈ వర్షం కారణంగా 31 విద్యుత్, నాలుగు నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా ఆగస్టు 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు మొత్తం 12 జిల్లాల్లోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Also Read: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment