TDP: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం! విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. By Bhavana 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి TDP: మాజీ పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబం ఊడ్చుకుపోయింది. విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ టీడీపీ నేత చేతిలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు. ఇక నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన బొత్స మేనల్లుడు అప్పలనాయుడు కూడా టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. గజపతినగరం నుంచి పోటీ చేసిన బొత్స తమ్ముడు అప్పలనర్సయ్య కూడా టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. విజయనగరం లోక్ సభ స్థానానికి పోటీ చేసిన బొత్స భార్య బొత్స ఝాన్సీ కూడా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో టీడీపీ అభ్యర్థులు బొత్స కుటుంబాన్ని ఊడ్చి ఎత్తి అవతల పారేశారు. Also read: మా కుటుంబానికి ఇది గర్వించదగ్గ రోజు ఇది..! #botsa-family #tdp #ycp #srikakulam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి