స్పీడ్ పెంచిన 'గేమ్ ఛేంజర్' టీమ్.. నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్

'గేమ్ ఛేంజర్' నెక్స్ట్ సాంగ్ పై థమన్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' అక్టోబ‌ర్ లోగేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ మెలోడిని విడుద‌ల చేస్తాం. ప్రేక్ష‌కుల‌ను ఈ పాట క‌ట్టిప‌డేస్తుంది. నవంబర్ నుంచి గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుంది' అని రాసుకొచ్చాడు.

New Update

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమానుఅగ్ర నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల సెకెండ్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 'రా.. మచ్చా, మచ్చా' అంటూ సాంగ్ ఈ సాంగ్ లో రామ్ చరణ్ తన మాస్ స్టెప్స్ తో అదరగొట్టారు. దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రెజెంట్ ఈ సాంగ్ తో వైబ్ అవుతున్న మెగా ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చాడు. 

ఈసారి మెలోడీ ట్రాక్..

మొదటి రెండు సాంగ్స్ మాస్ బీట్స్ తో సాగితే.. మూడో పాట మాత్రం మెలోడీ అని తెలిపాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' అక్టోబ‌ర్ లోగేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ మెలోడిని విడుద‌ల చేస్తాం. ప్రేక్ష‌కుల‌ను ఈ పాట క‌ట్టిప‌డేస్తుంది. నవంబర్ నుంచి గేమ్ ఛేంజర్ గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుంది..' అని రాసుకొచ్చారు. 

Also Read : 'ఓజీ' హీరోయిన్ కోలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుందా? పిక్స్ వైరల్, అసలు నిజం ఇదే

థమన్ అప్డేట్ తో ఫ్యాన్స్ లో జోష్ మరింత పెరిగింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.  ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 20 క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment