/rtv/media/media_files/2025/03/22/vMQ5jwIc5PwTJp6xUFIB.jpg)
SSMB 29 Updates
SSMB 29 Updates: ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli), మహేష్(Mahesh Babu SSMB 29) కంబోలో తెరకెక్కుతున్న మూవీ SSMB29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే అక్కడ పొందిన తన అనుభవాన్ని రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవ్మాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు. ఆద్భుతమైన విజువల్స్, ట్రెక్కింగ్ సమయంలో తాను చుసిన అందమైన దృశ్యాలు, ట్రెక్కింగ్ తో ఎంతో ఆనందమైన సమయాన్ని తాను గడిపినట్లు తెలిపారు.
Also Read: NTR- Nelson Movie: ఎన్టీఆర్- నెల్సన్ మూవీకి 'ROCK' ఇంగ్ టైటిల్..!
ఆ విషయంలో నిరాశపడ్డా..
ఈ మొత్తం అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇంత అందమైన ప్రదేశాన్ని తాను ఎప్పుడూ చూడలేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. అయితే, అక్కడి పరిసరాలు మాత్రం అశుభ్రంగా ఉండటం తనను కొంచెం నిరాశకు గురి చేసిందని తెలిపారు. బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ అంతటి అద్భుతమైన ప్రదేశాన్ని, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను వాడేసిన తరువాత పడేయకుండా తిరిగి తీసుకువెళ్లాలని సూచించారు.
Also Read: "టాక్సిక్"గా అదరగొడుతున్న రాకీ భాయ్..
ఇటీవల, #SSMB29 చిత్రం ఒడిశాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోరాపుట్ జిల్లా లో మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ కు ప్యాక్ అప్ చెప్పారు రాజమౌళి. అయితే, గత రెండు వారాల నుండి ఓడిశాలోని సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్సీల్, బాల్డ ప్రాంతాలలో షూటింగ్ జరిగింది ఈ మూవీ.SSMB 29లో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
Had an amazing solo trek to Deomali, Odisha’s highest and most stunning peak. The view from the top was absolutely breathtaking.
— rajamouli ss (@ssrajamouli) March 19, 2025
However, it was disheartening to see the trail marred by litter. Such pristine wonders deserve better. A little civic sense can make a huge… pic.twitter.com/8xVBxVqQvc