Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

డైరెక్టర్ అజయ్ భూపతి మిస్టరీ థ్రిల్లర్ 'మంగళవారం' సీక్వెల్ లో నటి శ్రీలీల ఫీమేల్  లీడ్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీక్వెల్ కథకు శ్రీలీల అయితే బాగుంటుందని దర్శకుడు అజయ్ భూపతి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

New Update

Mangalavaaram: 2023లో డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ 'మంగళవారం' ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని సాధించింది.  పాయల్ రాజ్ పుత్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు  తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీక్వెల్ కి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. 

Also Read: Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే

సీక్వెల్ లో శ్రీలీల

అయితే 'మంగళవారం' పార్ట్ 1లో పాయల్ పాత్రను ముగించిన  సంగతి తెలిసిందే. కాగా, సీక్వెల్ లో నటి శ్రీలీల ఫీమేల్  లీడ్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీక్వెల్ కథకు శ్రీలీల అయితే బాగుంటుందని దర్శకుడు అజయ్ భూపతి ఆలోచిస్తున్నట్లు సమాచారం. పార్ట్ 1 మాదిరిగానే పార్ట్ 2 లో కూడా హీరోయిన్ ఒక పల్లెటూరి యువతి పాత్రలోనే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముద్ర మీడియా బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ప్రియదర్శి, నందిత శ్వేతా, అజయ్ గోష్, దివ్య పిళ్ళై ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. శ్రీలీల ప్రస్తుతం  'రాబిన్హుడ్' మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. నితిన్ హీరోగా వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ లభించింది. 

cinema-news | mangalavaram-movie | sreeleela | Mangalavaaram Sequel

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు